రాష్ట్రీయం

సాగు కల సాకారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 7: తెలంగాణ వస్తే రెండో పంటకూ నీరు ఇచ్చుకునే విధంగా నీటిపారుదల వ్యవస్ధను మార్చుకుంటామనే మాట నిజమవుతోంది. పాత నిజామాబాద్, మెదక్ జిల్లాల పరిధిలోని రైతుల చిరకాల వాంచ అయిన రెండో పంటకు నీరందే స్వప్నం నెరవేరుతోంది. ఈ రెండు జిల్లాల పరిధిలోని రెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు సింగూరు ద్వారా రెండో పంటకు అవసరమైన నీరు అందించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. సమైక్య రాష్ట్రంలో రైతులు మొదటి పంట పండించుకోవడానికే నీళ్లు లేక అవస్ధలు పడ్డారని, ఇప్పుడు రెండో పంట పండించుకునే అవకాశం వస్తే ఎట్టి పరిస్ధితుల్లో వదులుకోవద్దని ముఖ్యమంత్రి చెప్పారు. శనివారం నుంచే నీటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావును ఆదేశించారు. నీటి విడుదల చేస్తున్న సందర్భంలోనే సింగూరు వద్ద జల విద్యుదుత్పత్తి ప్రారంభించాలని జెన్‌కో సిఎండి ప్రభాకర్‌రావును ఆదేశించారు. సింగూరు వద్ద 15 మెగావాట్ల యూనిట్లతో పూర్తిస్థాయ జల విద్యుదుత్పత్తి చేయాలని ఆదేశించారు. సింగూరు ప్రాజెక్టులో ప్రస్తుతం 28 టిఎంసి గరిష్ట నీటి మట్టం ఉంది. దీంతో ఈ నీటిని నిజాం సాగర్‌కు అందించి రెండో పంటకు నీరందించాలని మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, హరీశ్‌రావులు శనివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రిని కోరారు. సింగూరు నుంచి నీరు విడుదల చేయడం ద్వారా నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, ఆందోల్ నియోజకవర్లా పరిధిలో రెండు లక్షల ఎకరాల్లో రెండు పంట పండించుకునే అవకాశం ఉందని వివరించారు. రెండో పంట పండించుకోవడం ఇక్కడే ప్రజల కోరిక అని తెలిపారు. కాల్వలు కూడా సిద్ధంగా ఉన్నందున సింగూరు నుంచి నిజాంసాగర్‌కు 9 టిఎంసి నీరు వదిలితే, ఇప్పటికే ఉన్న 3 టిఎంసి నీటితో కలిపి నిజాంసాగర్‌లో నీరు 12 టిఎంసికి చేరుకుంటుందని మంత్రి పోచారం వివరించారు. ఈ నీటిని చాలా పొదుపుగా వాడుకుని నిజాం సాగర్ ఆయకట్టు కింద ఉన్న లక్ష 20 వేల ఎకరాల్లో రెండో పట సాగుచేసుకుంటారని చెప్పారు. అదే విధంగా సింగూరు నుంచి నీరు విడుదల చేయడం ద్వారా ఘణపురం ఆయకట్టును నింపుకుని 30 వేల ఎకరాలకు, ఆందోల్ ఎత్తిపోతల పథకం ద్వారా మరో 40 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని హరీశ్‌రావు చెప్పారు.