రాష్ట్రీయం

వచ్చే 8నుంచి అసెంబ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 17: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను నవంబర్ 8 నుంచి నిర్వహించనున్నారు. ఐదు రోజులపాటు జరిగే సమావేశాలకు సంబంధించి షెడ్యూల్‌ను అధికారికంగా మంగళవారం అసెంబ్లీ కార్యదర్శి విడుదల చేశారు. వర్షాకాల సమావేశాలు ప్రత్యేకంగా నిర్వహించకుండా, శీతాకాల సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. నవంబర్ 13 వరకూ జరిగే సమావేశాల్లో వివిధ కీలక బిల్లుపై చర్చ జరుగనుంది.
సిఎం విదేశీ పర్యటన నేపథ్యంలో..
పాలన కోసం ఐదుగురితో కమిటీ
ఇదిలావుంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటన నేపథ్యంలో పాలన కోసం ఐదుగురు మంత్రులతో కమిటీని మంగళవారం ఏర్పాటు చేశారు. కమిటీలో మంత్రులు కళా వెంకటరావు, చిన రాజప్ప, లోకేష్, కాలవ శ్రీనివాసులు, దేవినేని ఉమా ఉన్నారు. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా వ్యవసాయానికి నష్టం కలుగకుండా చూసేలా చర్యలు తీసుకోవాలని కమిటీని సిఎం ఆదేశించారు.