రాష్ట్రీయం

విద్యార్థిని ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంగాధర, అక్టోబర్ 20: ప్రభుత్వ మోడల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థినిని ప్రేమ పేరుతో ఉన్మాది వేధింపులకు గురి చేయడంతో ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గంగాధర మండలంలోని సర్వారెడ్డిపల్లిలో విషాదాన్ని నింపింది. కరీంనగర్ జిల్లా సర్వారెడ్డిపల్లి గ్రామ శివారు నర్సింహులపల్లి గ్రామానికి చెందిన తూడి రచన (19) గంగాధర మోడల్ స్కూల్‌లో ఇంటర్ చదువుతోంది.
దీపావళి సందర్భంగా స్వగ్రామం నర్సింహులపల్లికి వచ్చింది. అదే గ్రామానికి చెందిన విద్యార్థి గడ్డం సురేష్ ప్రేమపేరుతో వేధించడంతో మనస్తాపం చెందిన రచన బాత్‌రూములోకి వెళ్లి కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. తన కుమార్తెను ప్రేమ పేరుతో మానసికంగా వేధించడంతో ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తల్లి తూడి మల్లీశ్వరి ఫిర్యాదు చేశారు. నిందితునిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ స్వరూప్ రాజ్ తెలిపారు.