రాష్ట్రీయం

లాహిరి లాహిరి..లాహిరిలో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయపురిసౌత్, అక్టోబర్ 21: ప్రముఖ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ నుండి శ్రీశైలం వరకు కృష్ణానదిలో ప్రతిపాదించిన లాంచీ ప్రయాణానికి ఆదివారం ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. పర్యాటక అభివృద్ధి సంస్థ డివిఎం శ్యామ్‌ప్రసాద్ శనివారం నాగార్జునసాగర్ లాంచీ స్టేషన్‌లో విలేఖరులతో మాట్లాడుతూ నాగసిరి లాంచికి ఆదివారం ట్రైల్న్ నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 9 గంటలకు నాగసిరి లాంచీ స్థానిక లాంచీస్టేషన్ నుండి బయలుదేరుతుందన్నారు. సాగర్ నుంచి శ్రీశైలం 110 కిలోమీటర్ల దూరం ఉంటుందన్నారు. ఒకరోజు వెళ్లటానికి మరో రోజు రావటానికి రెండు రోజుల ప్రయాణానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రయాణంతోపాటు బసచేయటానికి, దైవ దర్శనం, భోజన ఏర్పాట్లతో ప్యాకేజిని ప్రకటించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ ట్రైల్న్‌ల్రో పర్యాటకశాఖ జిఎం రామకృష్ణతోపాటు అధికారులు పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో లాంచీయూనిట్ మేనేజర్ వి.సూర్యచంద్రరావు, సిబ్బంది పాల్గొన్నారు.