రాష్ట్రీయం

పుట్టపర్తికి నాలుగు ప్రత్యేక రైళ్లు ద.మ.రైల్వే ప్రకటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 8: భగవాన్ సత్యసాయి ఆధ్యాత్మిక ఉత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్లే ప్రయాణీకుల సౌకర్యార్థం పుట్టపర్తికి నాలుగు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ద.మ.రైల్వే ప్రకటించింది. ఈ నెల 18న కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైలు బయలుదేరుతుండగా, తిరుగు ప్రయాణంలో 19వ తేదీన సత్యసాయి ప్రశాంతి నిలయం నుంచి బయలుదేరుతుందని రైల్వే తెలిపింది. అలాగే విజయవాడ నుంచి ఈ నెల 23న ప్రత్యేక రైలు బయలుదేరి సత్యసాయి ప్రశాంతి నిలయంకు చేరుకుంటుందని, తిరుగు ప్రయాణంలో ఈ రైలు ఈ నెల 24న ప్రశాంతినిలయంలో బయలుదేరి తర్వాత రోజు కాకినాడ పోర్టుకు చేరుకుంటుందని రైల్వే వివరించింది.