రాష్ట్రీయం

వచ్చేనెల 7న విశాఖకు రాష్టప్రతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 15: రాష్టప్రతి రాజ్‌నాథ్ కోవింద్ రెండు రోజుల పర్యటన నిమిత్తం వచ్చే నెల 7న విశాఖకు వస్తున్నారు. ఆరోజు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ప్రత్యేక విమానంలో నగరానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఆంధ్రా యూనివర్శిటీకి వస్తారు. వర్శిటీలోని సౌత్ క్యాంపస్‌లో కొత్తగా నిర్మించిన జిమ్నాజియంను రాష్టప్రతి ప్రారంభిస్తారు. నార్త్ క్యాంపస్‌లోని కంప్యూటర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తరువాత వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో ప్రొఫెసర్స్, డీన్స్ తదితరులను ఉద్దేశించి రాష్టప్రతి కోవింద్ ప్రసంగిస్తారు. రాత్రికి నేవీ గెస్ట్ హౌస్‌లో బస చేస్తారు. 8న ఉదయం నేవీ హెడ్‌క్వార్టర్స్‌లో సర్కార్ మైదానంలో నావికాదళ సైనికులతో సైనిక వందనం స్వీకరించనున్నారు. ఆ తరువాత సబ్‌మెరైన్ సైనికులకు కలర్స్ ప్రజెంట్ చేస్తారు. సాయంత్రం ఢిల్లీకి వెళ్తారు.