జాతీయ వార్తలు
‘కోక్’తోనే సరి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
విశాఖపట్నం, నవంబర్ 17: మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ పర్యటన శుక్రవారం విశాఖలో సాదాసీదాగా జరిగింది. మధ్యాహ్నం సుమారు 2.30 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్న బిల్గేట్స్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి బిల్గేట్స్, చంద్రబాబు కలిసి ఒకే వాహనంలో అగ్రిటెక్ సమ్మిట్ జరుగుతున్న ఏపిఐఐసి గ్రౌండ్స్కు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను బిల్గేట్స్ కొద్దిసేపు తిలకించారు. అక్కడి నుంచి నేరుగా ప్రధాన వేదికకు చేరుకున్నారు. బిల్గేట్స్ వెంట చంద్రబాబు నాయుడు బిల్ అండ్ మిలిండా గేట్స్ సంస్థకు చెందిన అకేష్ వద్వాని, పూర్వి మెహత, ఉషాకిరణ్ తరిగొప్పుల మాత్రమే ఉన్నారు. నగరానికి వచ్చిన తరువాత బిల్గేట్స్ ఎక్కడా ఎటువంటి ఆహారాన్ని తీసుకోలేదు. వేదిక మీద ఉన్నప్పుడు ఆయన కోసం ప్రత్యేకంగా ఉంచిన కోకోకోలా డ్రింక్ను మాత్రమే తీసుకున్నారు. చంద్రబాబు తన ప్రసంగంలో బిల్గేట్స్ను పొగడ్తలతో ముంచెత్తుతున్నప్పుడు ఆయన చిరునవ్వుతోనే చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పారు.
సభ ముగిసిన తరువాత బిల్గేట్స్కు బొబ్బిలి వీణను, తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడలో తయారు చేసిన చీరను బిల్గేట్స్ భార్య మిలిండా కోసం బహుకరించారు. ఈ చీరను సిసలైన పట్టుతో 60 రోజులపాటు నేశారు. చిన్న పెట్టెలో ఈ చీరను అమర్చి బిల్గేట్స్కు చంద్రబాబు ఇచ్చారు. చీర విశిష్ఠతను గేట్స్కు చంద్రబాబు వివరించారు.
చిత్రాలు..మిలిండా కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఉప్పాడ చీరను బిల్గేట్స్కు అందచేస్తున్న సిఎం చంద్రబాబు..
*వేదికపై కోక్ తీసుకుంటున్న బిల్గేట్స్