ఆంధ్రప్రదేశ్
చంద్రబాబు ఆగ్రహం - తుని పరిణామాలపై సమీక్ష
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 31 January 2016
తుని-తునిలో నిర్వహించిన కాపుఐక్యగర్జన, అనంతర పరిణామాలపై ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులు, మంత్రులతో సమీక్షించారు. కాపుగర్జన సందర్భంగా తలెత్తే పరిణామాలను ముందుగానే ఎందుకు అంచనావేయలేకపోయారని, ఇది ఇంటెలిజెన్స్ వైఫల్యమని ఆయన అభిప్రాయపడ్డారు. అధికారులు, నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఉద్దేశపూర్వకంగానే విధ్వంసానికి ఉసిగొల్పారని, ఇందులో జగన్ హస్తం ఉందని, దేశస్థాయిలో కాపుల ప్రతిష్ట దిగజార్చే కుట్ర ఇదని మంత్రులు నారాయణ, యనమల ఆరోపించారు. సంఘవిద్రోహశక్తులను ఉసిగొల్పి దాడులకు తెగబడ్డారని వారు ఆరోపించారు. కాగా తుని సంఘటనల నేపథ్యంలో ఎక్కడికక్కడ పలు రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.