రాష్ట్రీయం

పాలనా ఫలాలు ప్రజలకు అందాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 24: దస్త్రాల పరిష్కారంలో జాప్యాన్ని నివారించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 20 ఏళ్ల క్రితం తీసుకువచ్చిన సంస్కరణల వల్ల ఈ రోజు హైదరాబాద్ పొందుతున్న ఫలితాలు కళ్లముందే ఉన్నాయని చెబుతూ, అంతకంటే ఉన్నత సంస్కరణలతో రాష్ట్రం దూసుకెళ్లడానికి చేస్తున్న కృషికి చేదోడువాదోడుగా నిలవాలని ప్రభుత్వ యంత్రాంగానికి పిలుపునిచ్చారు. పాలనలో తీసుకొస్తున్న సంస్కరణల ఫలాలు తక్షణం ప్రజలకు చేరాలని, దానికి ఉద్యోగుల సహకారం అత్యంత అవసరమని అన్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి తన కార్యాలయంలో ఐవోటీ, ఐటీ, ఫైబర్ నెట్, రియల్‌టైమ్ గవర్నెన్స్ తదితర అంశాలపై వివిధ శాఖాధికారులతో సమీక్ష జరిపారు. సమీక్షకు హాజరైన వివిధ శాఖల అధికారులకు సచివాలయం మొదటి భవనంలో ఏర్పాటు చేస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను స్వయంగా చూపించి, సెంటర్ ఏ విధంగా పనిచేస్తుందో ముఖ్యమంత్రి స్వయంగా వివరించారు. వచ్చే ఆదివారం ఈ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అత్యాధునిక సాంకేతికతతో, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇకపై రియల్ టైం గవర్నెన్స్‌లో కీలక భూమిక పోషించనుందని తెలిపారు. రాష్ట్ర ఐటీ శాఖ అత్యున్నత సైబర్ సెక్యూరిటీ పరిజ్ఞానాన్ని తయారు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మంత్రి లోకేశ్‌కు సూచించారు. కేంద్రంతో మాట్లాడి డ్రోన్ కార్పొరేషన్ ఏర్పాటుకు అనుమతులు తీసుకున్నామని, ఈ టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకోవాలని చెప్పారు. ఫైబర్ గ్రిడ్, డ్రోన్ కార్పొరేషన్, టవర్ కార్పొరేషన్, వర్చువల్ క్లాస్ రూములు, కంటెంట్ కార్పొరేషన్ వంటి వాటినన్నింటినీ సమీకృతం చేసి నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకొని తీరాలన్నారు. 1,23,000 సెట్ టాప్ బాక్స్‌లు అందుబాటులో ఉన్నాయని, వారానికి పది వేల బాక్స్‌లు ఏర్పాటు
చేస్తున్నామని ఫైబర్ నెట్ సీఈవో అహ్మద్ బాబు తెలపగా, ఈ వేగం సరిపోదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. మన టీవీ సేవలను కూడా విస్తృతంగా ఉపయోగించుకోవాలని చెప్పారు. దీని నిర్వహణ బాధ్యతలు ఏపి ఫైబర్ నెట్ లిమిటెడ్‌కు అప్పగించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. వర్చువల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు వేగవంతం చేయాలన్నారు. అన్ని స్కూళ్లకు ఫైబర్ కనెక్టివిటీ ఇవ్వాలని ఆదేశించారు. అన్ని పురపాలక సంఘాల పరిధిలో ప్రజలకు ప్రభుత్వ సమాచారాన్ని అందించే ఎలక్ట్రానిక్ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలోచనలు, ఆవిష్కరణలు అనుకున్నట్లుగా అమలు చేయగలిగితే అద్భుతాలు చేయవచ్చునని చెప్పారు. ఇ-ప్రగతి ద్వారా ప్రతి శాఖను అనుసంధానం చేసి ప్రజలకు రియల్ టైమ్‌లో సేవలు అందించాలని కోరారు. ఈ ఉద్దేశ్యంతోనే ప్రతి రోజు ఉదయానే్న రియల్ టైం గవర్నెన్స్ కోసం ఒక గంట సమయం వెచ్చిస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో మంత్రి నారా లోకేశ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్, డీజీపీ నండూరి సాంబశివరావు, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్, అదనపు కార్యదర్శి రాజవౌళి, జీఏడీ ముఖ్య కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్, ఆర్టీజీ సీఈవో బాలసుబ్రహ్మణ్యం, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ పాల్గొన్నారు.

చిత్రం..వివిధ శాఖల అధికారులతో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు