రాష్ట్రీయం
‘108 సర్వీసులు అప్పగించడం సబబే’
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 8 December 2017
హైదరాబాద్, డిసెంబర్ 7: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 108 అంబబులెన్స్సర్వీసులను బివిజి ఇండియా, యుకె స్పెషలిస్టు అంబులెన్స్ సర్వీసుల కంట్రాక్టును అప్పగించడం సబబేనంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ ఎస్ అభినంద కుమార్తో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. జివికె ఎమర్జన్సీ మేనేజిమెంట్ రీసెర్చి సంస్థ దాఖలు చేసిన పిటిషన్నుహైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. ఈకేసులో అంతకుముందు సింగిల్కోర్డు జడ్జిని జివికె ఆశ్రయించగా, పిటిషన్ను కొట్టివేసింది. తమకు కంట్రాక్టు ఇవ్వాలని జివికె కోర్టును కోరింది. 15రోజుల పాటు సేవల నిర్వహణపై స్టే ఇవ్వాలన్న పిటిషనర్ వినతిని హైకోర్టు తోసిపుచ్చింది.