రాష్ట్రీయం

లీడర్ కేటీఆర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 17: పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావుకు మరో ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. ఇప్పటికే పలు జాతీయ అవార్డులు దక్కించుకున్న మంత్రికి ఈసారి లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది. ప్రముఖ మీడియా సంస్థ బిజినెస్ వరల్డ్ మంత్రి కేటీఆర్‌కు ఈ అవార్డు ప్రదానం చేయనుంది. మంత్రిగా నూతన తెలంగాణను దేశ యవనికపై తనదైన శైలిలో నిలిపిన తీరుని సంస్థ ఈ సందర్భంగా అభినందించింది. దీంతోపాటు పాలనపరంగా మంత్రి నిర్వహిస్తున్న బాధ్యతలు, తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తున్న తీరు, దేశవ్యాప్తంగా మంత్రికి లభించిన పేరు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని అవార్డు ఇస్తున్నట్టు బిజెనెస్ వరల్డ్ తెలిపింది. పట్టణ వౌలిక వసతులున్న ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణకు మరో అవార్డును సంస్థ అందించనుంది. పట్టణాల్లో మిషన్ భగీరథ (అర్బన్)ను చేపట్టడం ద్వారా ఇంటింటింకి రక్షిత తాగునీరు అందించే కార్యక్రమం చేపట్టినందుకు బిజెనెస్ వరల్డ్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. రాష్ట్రంలో గ్రీన్ కవర్‌ను పెంచేందుకు చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని పట్టణాల్లో అమలు చేయడం, హైదరాబాద్‌లోనే లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టడం ద్వారా పేద ప్రజలకు పక్కాగృహాలు అందించే అంశాల్లో చేస్తున్న కృషిని పరిగణలోకి తీసుకున్నామని బిజెనెస్ వరల్డ్ తెలిపింది. అవార్డులతోపాటు తాను నిర్వహిస్తున్న ఐదవ జాతీయ స్మార్ట్ సిటీ కాన్ఫరెన్స్‌కు హాజరు కావాల్సిందిగా మంత్రి కేటీఆర్‌కు సంస్థ ఆహ్వానం పంపింది. ఈనెల 20న ఢిల్లీలో జరుగనున్న సదస్సులో స్మార్ట్, సేఫ్ సస్టెనబుల్ సిటీస్ అనే అంశాలపై ప్రధానంగా చర్చ జరుగనుంది. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి హర్దీప్ సింగ్ సూరి ఈ సమావేశాలకు హాజరు కానున్నారు.