రాష్ట్రీయం
మహాత్మాగాంధీ డిజిటల్ మ్యూజియం స్టోర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 20 December 2017
జాతిపిత మహాత్మాగాంధీ ఆశలు, ఆకాంక్షలకు అద్దంపడుతూ ఆయన ఆలోచనలను మరింత వెలుగులోకి తెచ్చే లక్ష్యంతో ఏకంగా ఓ డిజిటల్ మ్యూజియం ప్రారంభమైంది.
హైదరాబాద్లోని లంగర్హౌస్లోగల బాపూ ఘాట్ వద్ద దేశంలోనే మొట్టమొదటిసారిగా మంగళవారం
మహాత్మాగాంధీ డిజిటల్ మ్యూజియం స్టోర్ను ప్రారంభించారు. ఇందులో వందకుపైగా సావనీర్లు, దుస్తులు, పుస్తకాలు, బ్యాగులు, వ్యక్తిగత వస్తువులు పొందుపర్చారు. ఆధునిక టెక్నాలజీ డిజైన్ల సహకారంతో మహాత్ముడి ఆశయాలకు మరింత వనె్న తెచ్చే ప్రయత్నంలో భాగంగానే ఈ మ్యూజియం ప్రారంభమైంది. దక్షిణాఫ్రికా పార్లమెంట్ మాజీ సభ్యుడు, శాంతి కార్యకర్త, మహాత్ముడి మనవరాలు ఈలా గాంధీ ఈ స్టోర్ను ప్రారంభించారు.