రాష్ట్రీయం

రైతు కుటుంబం బలవన్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుస్నాబాద్, డిసెంబర్ 19: ఆర్థిక ఇబ్బందులు రైతు కుటుంబాన్ని పొట్టనపెట్టుకున్నాయ. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డివిజన్ అక్కన్నపేట మండలంలోని తురుకవాణికుంటలో మంగళవారం ఈ సంఘటన పలువురిని కంటతడిపెట్టించింది. మృతుల బంధువుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుండ భగవాన్ రెడ్డి (50) తనకున్న నాలుగున్నర ఎకరాల భూమిలో పత్తి, వరి సాగు చేస్తూ కొడుకు ప్రేంచంద్రారెడ్డి (25), కూతురు రోజా (22)లను ఎంబీఏ వరకు చదివించాడు. ఈ క్రమంలో వీరి చదువుతో పాటు వ్యవసాయంపై 5 లక్షల వరకు అప్పులు చేశాడు. దీనికితోడు వ్యవసాయంపై సరైన పంట రాకపోవడం, పత్తి, వరికి దోమపోటు సోకడంతో దిగులు చెందిన భగవాన్‌రెడ్డి మంగళవారం తెల్లవారుజామున తన కుమారుడు, కూతురు, భార్య రాజవ్వ (45)లతో పురుగుల మందు తాగించి, తాను తాగి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనలో కుమారుడు, కుమార్తె, తండ్రి విగతజీవులయ్యారు. భార్య రాజవ్వ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా ఆమెను మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుని మామ బొడ మల్లారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ పాపయ్యనాయక్ తెలిపారు.