రాష్ట్రీయం

శ్రీవారి గోసంరక్షణకు రూ. 11.11కోట్లు విరాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 19: టీటీడీ నిర్వహిస్తున్న గోసంరక్షణ పథకానికి ముంబైకి చెందిన ఒక ప్రవాస భారతీయుడు రూ.11.11 కోట్లను విరాళంగా ఇచ్చాడు. చెక్కు రూపంలో ఇచ్చిన ఈ మొత్తాన్ని టీటీడీ ఈ ఓ అనిల్‌కుమార్ సింఘాల్, ఎస్వీ డైరీ ఫాం డైరెక్టర్ డాక్టర్ హరినాథ రెడ్డి మంగళవారం స్వీకరించారు. తనకు ఎలాంటి ప్రచారం అవసరం లేదని పేరు చెప్పడానికి కూడా ఆభక్తుడు ఇష్టపడలేదు. దీంతో అంతపెద్ద ఎత్తున విరాళం ఇచ్చినా, అందుకు సంబంధించిన సమాచారాన్ని మీడియాకు తెలియజేయలేదు.ఈ అజ్ఞాత భక్తుడే ఏప్రిల్‌లో గో సంరక్షణ పథకానికి రూ. 80లక్షలు విరాళం ఇచ్చాడు. ఆ సమయంలో పలమనేరులో టీటీడీ ఏర్పాటు చేసిన గోశాలను సందర్శించారు. గోసంరక్షణకు టీటీడీ చేస్తున్న కృషికి ముగ్దుడైన ఆయన మరో గొప్ప విరాళాన్ని మంగళవారం టీటీడీకి అందించారు.