రాష్ట్రీయం

రాష్టప్రతి నిలయంలో ఎట్ హోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 26: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు వచ్చిన రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ తన పర్యటన సందర్భంగా బొల్లారంలోని రాష్టప్రతి నిలయంలో మంగళవారం సాయంత్రం ఎట్ హోం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు, శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, ప్రతిపక్ష నాయకుడు కె జానారెడ్డి, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు ఈటల రాజేందర్, నాయిని నరసింహరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్, ప్రభుత్వ ప్రధాన ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, కేంద్ర మాజీ మంత్రి, ఎంపి బండారు దత్తాత్రేయ తదితర ప్రముఖులు హాజరయ్యారు. రాష్టప్రతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బొల్లారంలోన రాష్టప్రతి నిలయంలో తొలిసారి బస చేసిన తన అనుభవాలను, ఇక్కడి వాతావరణ పరిస్థితులను ఈ సందర్భంగా గవర్నర్, ముఖ్యమంత్రితో రామ్‌నాథ్ కోవింద్ పంచుకున్నారు.

చిత్రం..శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు వచ్చిన రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ బొల్లారంలోని రాష్టప్రతి నిలయంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన ఎట్ హోంకు హాజరై అభినందనలు తెలుపుతున్న గవర్నర్ నరసింహన్, సీఎం కె చంద్రశేఖర్ రావు