రాష్ట్రీయం

కేంద్రం పాత్ర ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 12: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందించడంలో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉందని మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. శుక్రవారం ఆయన కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్ తోమర్, ఆర్‌కే సింగ్, హర్దీప్ సింగ్ పూరిలతో భేటీ అయ్యారు. తరువాత విలేఖరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సహకరించబట్టే వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సాధ్యమైందని అన్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాల సంయుక్త ప్రాజెక్టు అని దత్తాత్రేయ చెప్పారు. గతంలో విద్యుత్ మంత్రిగా పియూష్ గోయల్ ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వాల మధ్య కుదుర్చుకున్న ఒప్పందం వల్లే ఇది సాధ్యమైందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు, విద్యుత్ పంపిణీ మండళ్లు (డిస్కం)లకు గతంలోనే కేంద్ర ప్రభుత్వం రాయితీలు ప్రకటించిందని మాజీ మంత్రి గుర్తుచేశారు.