రాష్ట్రీయం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదుగురి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, జనవరి 14: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి, ములకలపల్లి మండలాల్లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. టేకులపల్లి మండలం బేతంపూడి పంచాయతీ తంగెళ్ళగడ్డ గ్రామం వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ మరో ఇద్దరిని కొత్తగూడెం ఆసుపత్రికి తరలిస్తుండగా ఒకరు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరిని మాలోత్ మోతీలాల్ (35), ఎన్ రమేష్ (32) ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరో ఇద్దరు మహిళలు ఎవరనే విషయమై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.ములకలపల్లి బస్టాండ్ సమీపంలో జరిగిన ప్రమాదంలో తాటికొండ రామాచారి (35) మృతి చెందాడు. ప్రభాకర్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వైద్య చికిత్స కోసం కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పాల్వంచ సమీపంలోని నాగారం వద్ద జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా వుంది.