రాష్ట్రీయం

శ్రీశైలంలో ఆది దంపతుల కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, జనవరి 16: సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మకర సంక్రాంతిని పురస్కరించుకుని సోమవారం శ్రీశైలంలో ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల కల్యాణాన్ని వేడుకగా నిర్వహించారు. ఉత్సవమూర్తులను అందంగా అలంకరించి అక్క మహాదేవి అలంకరణ మండలంలోకి తోడ్కొని వచ్చారు. అక్కడ వేదికపై స్వామి, అమ్మవార్లను ఆశీనులను చేయించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళవాయిద్యాలు, పండితుల వేద మంత్రాల నడుమ అమ్మవారు, స్వామివారి కల్యాణం నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఈ సుందర దృశ్యాన్ని చూసి పులకించి పోయారు. అనంతరం నంది వాహనంపై స్వామి, అమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మల్లన్న, భ్రమరాంబిక అమ్మవార్లకు పుష్ప పల్లకి ఉత్సవం నిర్వహించారు. పుష్పపల్లకిలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఆశీనులను జేయించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రకరకాల పుష్పాలను ఇందుకు వినియోగించారు. పుష్పపల్లకిలో గ్రామోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ నారాయణ భరత్‌గుప్తా, అర్చకులు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

చిత్రం..సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీశైలంలో పార్వతీ పరమేశ్వరుల కల్యాణాన్ని నిర్వహిస్తున్న దృశ్యం