రాష్ట్రీయం

ఘనంగా పార్వేటి ఉత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 16: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి పార్వేటి ఉత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. స్వామివారికి ప్రాతః కాలారాధన పూర్తయిన తర్వాత శ్రీ మలయప్ప స్వామివారు వెండి తిరుచ్చిలో, శ్రీ కృష్ణ స్వామివారు మరో తిరుచ్చిలో పార్వేటి మండపానికి చేరుకున్నారు. అనంతరం శ్రీ మలయప్ప స్వామివారు శ్రీ కృష్ణస్వామివారు పార్వేటలో ఉత్సాహంగా పాల్గొన్నారు. శ్రీ మలయప్ప స్వామి వారి తరపున అర్చకులు 3సార్లు బాణం, ఈటెలు వేసి మాదిరి వేటను ప్రదర్శించి, భక్తులకు కనువిందు చేశారు. ఈ ఉత్సవంటో టీటీడీ ఉన్నతాధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

చిత్రం.. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి మంగళవారం పార్వేటి ఉత్సవం నిర్వహిస్తున్న అర్చకులు