రాష్ట్రీయం
నేడు రక్తదాన శిబిరాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 18 January 2018
హైదరాబాద్, జనవరి 17: తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా 18న (గురువారం) దేశ వ్యాప్తంగా లెజండరీ రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ ట్రస్టు ముఖ్య కార్యనిర్వహణాధికారి (సిఇవో) టి. విష్ణువర్ధన్ తెలిపారు. లెజండరీ రక్తదాన శిబిరానికి ‘ఫేస్ బుక్’ సహకరిస్తున్నట్లు ఆయన బుధవారం విలేఖరుల సమావేశంలో చెప్పారు. ఎన్టీఆర్ ట్రస్టు బ్లడ్ బ్యాంక్ నిపుణుడు డాక్టర్ హితేష్ మాట్లాడుతూ లెజండరీ రక్తదాన శిబిరాలను ఈ ఏడాది ఆంధ్ర ప్రదేశ్లో 103 కేంద్రాల్లో, తెలంగాణలో 30 కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇంకా 18 రాష్ట్రాల్లో 140 కేంద్రాల్లో శిబిరాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.