రాష్ట్రీయం

డిజిటల్ భారత్ ఇదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 18: రియల్‌టైమ్ గవర్నెన్స్, దాని పనితీరును చూస్తుంటే తాను భారత్‌లో ఉన్నట్లు అనిపించలేదని, ఇది అద్భుతం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధించిన అనిర్వచనీయమైన విజయమని కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజీవ్ కుమార్ ప్రశంసించారు. వెలగపూడిలోని సచివాలయంలో ఉన్న రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ (ఆర్టీజీసీ)ను గురువారం ఆయన బృందం సందర్శించింది. ఈ సందర్భంగా ఈ కేంద్రం ఎలా పనిచేస్తున్నది. ప్రజలకు సకాలంలో అందిస్తున్న సేవలు, డిజిటల్ సేవల్లో ఆంధ్రప్రదేశ్ దూసుకెళుతున్న తీరును నిశితంగా పరిశీలించారు. అనంతరం ఆయన అధికారులతోనూ, మీడియాతోనూ మాట్లాడారు. ‘ఆంధ్రప్రదేశ్ సాధించిన ఒక అద్భుత విజయం ఆర్టీజీఎస్. ఇలాంటి వ్యవస్థ దేశంలో మరెక్కడా లేదు. ఇక్కడున్నంతసేపు నేను భారత్‌లో ఉన్నట్లుగా అనిపించలేదు. అంత గొప్పగా దీన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ప్రతి రాష్ట్రానికి ఏపీ అమలు చేస్తున్న రియల్ టైమ్ గవర్నెన్స్ కనువిప్పు కావాలి. ప్రతి రాష్ట్రంలోనూ ఈ తరహా వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలన్నదే మా అభిప్రాయం. ఇంత గొప్ప వ్యవ్థను ఏర్పాటు చేసుకుని ప్రజలకు మంచి సేవలు అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆర్టీజీఎస్ నిర్వాహకులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను’ అన్నారు. డిజిటల్ భారతదేశపు భవిష్యత్తు ఇదేనని ఆయన ప్రశంసించారు. ప్రతి రాష్ట్రం ఇక్కడకు వచ్చి ఈ ఆర్టీజీఎస్‌ను పరిశీలించాలని తాము సిఫారసు చేస్తామన్నారు.
ఢిల్లీకి రావాలని ఆహ్వానం
సచివాలయంలో రియల్‌టైమ్ గవర్నెన్స్ పనితీరు చూసి సంభ్రమాశ్చర్యాలకు గురైన నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్ ఢిల్లీలో దీన్ని ప్రదర్శించాలని ఆర్టీజీఎస్ అధికారులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆహ్వానించారు. త్వరలోనే దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో సదస్సు నిర్వహిస్తోందని, ఈ సదస్సులో ఏపీ అమలు చేస్తున్న ఆర్టీజీఎస్ విధానాన్ని ప్రదర్శించాలని కోరారు. తద్వారా మిగిలిన రాష్ట్రాల వారూ దీని గురించి తెలుసుకునే వీలుంటుందన్నారు. ఇందుకోసం కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన సూచించారు. త్వరలోనే ఈ సదస్సు జరిగే తేదీని తెలియజేస్తామన్నారు.
దావోస్‌లో ప్రదర్శిస్తున్నాం: ఎ.బాబు
ఢిల్లీలో జరిగే రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల సదస్సులో ఆర్టీజీఎస్ గురించి ప్రదర్శించాలని నీతి ఆయోగ్ ఆహ్వానించడం పట్ల ఆర్టీజీఎస్ సీఈఓ అహ్మద్ బాబు సంతోషం వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్ సూచనల మేరకు తాము తప్పకుండా ఢిల్లీలో ఆర్టీజీఎస్‌ను ప్రదర్శించి వివరిస్తామని తెలిపారు. ఈ నెలలో దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో కూడా దీన్ని ప్రదర్శిస్తున్నట్లు వెల్లడించారు. రాష్టవ్య్రాప్తంగా 20 వేల కెమెరాలతో నిఘాను ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తామని, ప్రస్తుతం 5 వేల కెమెరాలు ఏర్పాటు చేశామని, త్వరలో 20 వేల కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భూసార పరీక్షలను ఎప్పటికప్పుడు పరీక్ష చేసి, వాటి వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచడంతో పాటు రైతులకు ఆ వివరాలు అందచేస్తూ, ఆయా ప్రాంతాల భూసారాన్ని బట్టి అక్కడ పంటలు వేసుకునేలా రైతులకు సలహాలు ఇస్తున్నామని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తోందని చెప్పారు.ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి ఎన్.అమరనాథరెడ్డి, రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, పరిశ్రమల శాఖ సంచాలకులు సిద్ధార్థ జైన్, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ ప్రభుత్వ ప్రతినిధి ప్రీతమ్ రెడ్డి, ఆర్టీజీఎస్ సంచాలకులు బాలాజీ ఆదివిష్ణు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..రియల్‌టైమ్ గవర్నెన్స్ సెంటర్ గురించి నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్‌కు వివరిస్తున్న ఆర్టీజీఎస్ సీఈవో అహ్మద్‌బాబు