రాష్ట్రీయం

శ్రీ సత్యసాయి ట్రస్టీ రత్నాకర్‌పై కేసును మళ్లీ దర్యాప్తు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 18: అనంతపురం జిల్లా పుట్టపర్తి పోలీసు స్టేషన్‌లో శ్రీ సత్యసాయి ట్రస్టీగా ఉన్న రత్నాకర్‌పై నమోదై ఉన్న కేసును మళ్లీ విచారించాలని హైదరాబాద్ హైకోర్టు గురువారం ఏపి సిఐడి శాఖను ఆదేశించింది. దివంగత సత్యసాయిబాబు బంధువు ఎం గణపతి రాజు దాఖల దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి బి శివశంకర్ రావు విచారించారు. 2013లో రత్నాకర్‌పైన పుట్టపర్తి పిఎస్‌లో కేసు నమోదై ఉందని ఆయన పిటిషనర్ పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించిన రికార్డులను స్థానిక పోలీసు స్టేషన్ నుంచి స్వాధీనం చేసుకుని ఈ కేసు పెండింగ్‌లో లేదా తుది నివేదికను సిద్ధం చేశారా అనే విషయమై విచారించి నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. రత్నాకర్‌తో స్థానిక పోలీసులు కుమ్మక్కై ఆయనపై నమోదు చేసిన కేసును విచారించకుండా తాత్సారం చేశారని పిటిషనర్ పేర్కొన్నారు. తనపై నమోదై ఉన్న కేసును కొట్టివేయాలంటూ గణపతిరాజు కోర్టులో మరో పిటిషన్‌ను కూడా దాఖలు చేశారు. ఈ కేసును విచారించే దిగువ కోర్టులో తన వాదనను వినిపించుకోవాలంటూ, కేసును కొట్టివేయడానికి కోర్టు నిరాకరించింది.