ఆంధ్రప్రదేశ్‌

ఆంధ్రావాళ్లు వచ్చేస్తే ఖజానా ఫుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 18: ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రావారంతా ఏపీకి తిరిగివస్తే రాష్ట్రానికి ఎలాంటి ఆర్ధిక సమస్యలూ ఉండవని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్ స్పష్టం చేశారు. కలెక్టర్ల సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘హైదరాబాద్‌లో 40 శాతం మంది ఏపీ వాళ్లే ఉన్నారు. పన్ను చెల్లించేవాళ్లలో 40 శాతం మంది ఆంధ్రావాళ్లే ఉన్నారు. వాళ్లంతా తిరిగి ఏపీకి వస్తే ఖజానాకు ఎలాంటి కష్టాలు ఉండకపోగా, మీరే మిగిలిన వారికి సహకరించే పరిస్థితికి ఎదుగుతారు’ అని వ్యాఖ్యానించారు.