రాష్ట్రీయం

రథ సప్తమికి ఫేస్ రికగ్నేషన్ కెమెరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 19: తిరుమలలో జనవరి 24న రథసప్తమినాడు ఫేస్ రికగ్నిషన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసి భక్తులకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపడతామని టీటీడీ సీవీఎస్వో ఆకె రవికృష్ణ వెల్లడించారు. తిరుమలలోని పీఏసీ- 4లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మొత్తం 600మంది నిఘా, భద్రతా సిబ్బందిని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రథసప్తమి నాడు మాడ వీధుల్లో ఏడు వాహనాలపై శ్రీవారు విహరిస్తారని, ఈ ఉత్సవాలను చూడడానికి లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తారన్నారు. వారి భద్రతకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సారి ఫేస్ రికగ్నిషన్ కెమేరాలతో దొంగలు, అసాంఘిక శక్తుల కదలికలు కనిపెట్టి నిఘా పటిష్టంగా చేపడుతున్నామన్నారు.