రాష్ట్రీయం

నాంపల్లి కోర్టుకు హాజరైన జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఇక్కడ నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. అనంతరం విజయవాడ వైకాపా నేత వంగవీటి రాధ, గుడివాడ వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని పార్టీ అధ్యక్షుడు జగన్‌ను కలుసుకున్నారు. మీడియాలో వస్తున్న వదంతులను నమ్మకుండా, పార్టీ అభివృద్ధి, విస్తరణపై దృష్టి పెట్టాలని జగన్ తనను కలిసిన వంగవీటి రాధను కోరినట్లు సమాచారం. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలు విసిగి ఉన్నారని, పార్టీలో అందరిని కలుపుకుని కింది స్ధాయి నుంచి పార్టీని పటిష్టం చేయాలని జగన్ సూచించినట్లు తెలిసింది. పాదయాత్రకు అపూర్వ స్పందన లభిస్తోందని ప్రత్యేక హోదా సాధనలో చంద్రబాబు వైఫల్యంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. బూత్ స్థాయి నుంచి పార్టీని కోస్తా జిల్లాల్లో అభివృద్ధికి కృషి చేయాలని జగన్ వంగవీటి రాధను కోరినట్లు తెలిసింది.