రాష్ట్రీయం

కృష్ణపట్నంలో రిఫైనరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 23: ఆంధ్రప్రదేశ్‌కు 974 కిలోమీటర్ల సముద్రతీరం ఉందని, కృష్ణా-గోదావరి బేసిన్‌లో అపార చమురు నిక్షేపాలు ఉన్నాయని, పెట్రోలియం శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు దేశంలో తమ రాష్ట్రం ఎంతో అనుకూలమని సౌదీ ఆర్మ్‌కో సంస్థకు సీఎం చంద్రబాబు సూచించారు. దావోస్ పర్యటనలో రెండోరోజు మంగళవారం సౌదీ ఆర్మ్‌కో ప్రెసిడెంట్ సైద్ అల్ హద్రమీతో బాబు సమావేశమయ్యారు. తమ రాష్ట్రాన్ని తాకుతూ రెండు పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయని, కృష్ణపట్నాన్ని లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దుతామని, రిఫైనరీ ఏర్పాటు వాణిజ్యపరంగా ఎంతో లాభసాటి అవుతుందని, స్వదేశంలో మార్కెటింగ్‌కు అనువుగా ఉంటుందని వివరించారు. పెట్రోలియం, రసాయన పరిశ్రమల ఏర్పాటు, విస్తరణకు తమ రాష్ట్రంలో ఇప్పటికే సానుకూల వాతావరణం ఉందని, హెచ్‌పీసీఎల్, గెయిల్ కార్యకలాపాలకు ఆంధ్ర ఆయువుపట్టుగా ఉందని వివరించారు. రాష్ట్రంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ, సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్
అండ్ టెక్నాలజీను స్థాపించనున్నామని, ఇందువల్ల నైపుణ్యం కలిగిన మానవ వనరులు లభిస్తాయని చంద్రబాబు వివరించారు. ఇది రాష్ట్రంలో సమీప భవిష్యత్‌లో పెట్రోలియం పరిశ్రమల ఏర్పాటుకు మరింత అనువైన వాతావరణం ఏర్పడేందుకు దారితీస్తుందని చెప్పారు. గతంలో సీఎం చంద్రబాబు భేటీ అయిన కంపెనీల్లో సౌదీ ఆర్మ్‌కో ఒక ప్రధాన కంపెనీ. కృష్ణపట్నంలో రిఫైనరీ ఏర్పాటుకు ఇప్పటికే ఆసక్తి చూపుతోంది. ఆ కంపెనీ ప్రతినిధులు రాష్ట్రాన్ని రెండు పర్యాయాలు సందర్శించారు. వారితో నిరంతర చర్చలు సాగిస్తున్న సీఎం చంద్రబాబు, రాష్ట్రానికి సౌదీ ఆర్మ్‌కో రిఫైనరీ తేవాలన్న పట్టుదలతో ఉన్నారు. ఈక్రమంలో ముంబయిలో ఈ నెలాఖరులో సౌదీ ఆర్మ్‌కో ప్రతినిధులను ఆంధ్ర ప్రభుత్వ ప్రతినిధులు మరోసారి కలవనున్నారు.
కాగా సౌదీ ఆర్మ్‌కో కంపెనీ మహారాష్టల్రో 40 బిలియన్ల అమెరికన్ డాలర్ల పెట్టుబడితో ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ కంపెనీలతో సంయుక్త భాగస్వామ్యంలో మెగా రిఫైనరీ ఏర్పాటు చేయాలని భావిస్తున్న సౌదీ ఆర్మ్ సంస్థ రిఫైనరీ ఏర్పాటుకు అన్ని అవకాశాలు, సామర్ధ్యం ఉన్న కీలక ప్రదేశంగా మన రాష్ట్రంలోని కృష్ణపట్నాన్ని గుర్తించింది. గత ఏడాది అక్టోబర్‌లో ఈ కంపెనీ భారత్ రాజధాని ఢిల్లీలో ఆర్మ్‌కో ఏషియా- ఇండియా శాఖ కార్యాలయాన్ని ప్రారంభించింది. భారత పశ్చిమ తీరంలో భారీ చమురు శుద్ధి కర్మాగారం ఏర్పాటుకు నిశ్చయించింది. భారత్ మార్కెట్‌లో మరింత వాటా దక్కించుకోవటానికి ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
ఆంధ్రలో 640 చదరపు కిలోమీటర్లమేర చమురు, రసాయనాలు, పెట్రోకెమికల్స్ ఇనె్వస్టిమెట్ రీజియన్‌లో ఉందని, అలాగే 6 సెజ్‌లు ఉన్న విషయాలను అధ్యయనం చేసిన సంస్థ రాష్ట్రంలోని కృష్ణపట్నాన్ని తన పెట్టుబడులకు ప్రాధాన్యత కేంద్రంగా ఎంచుకుంది. ఈ దిశగా వారిని ఒప్పించి మన రాష్ట్రానికి భారీ రిఫైనరీ తీసుకురావాలన్న లక్ష్యంతో సీఎం బాబు ఈ సంస్థ ప్రతినిధులతో గతంలో సమావేశమయ్యారు.
చంద్రబాబుకు అభినందనలు
ఫిబ్రవరిలో విశాఖలో నిర్వహించనున్న సీఐఐ పెట్టుబడుదారుల సదస్సుకు హాజరుకావాలని ఆయన సౌదీ ఆర్మ్‌కో ప్రెసిడెంట్ సైద్ అల్ హద్రమీని ఆహ్వానించారు. తమ రాష్ట్రంలో ప్రాజెక్టుల ఏర్పాటుకు శరవేగంగా చర్యలు తీసుకుంటున్నామని, వ్యాపార సానుకూల వాతావరణం ద్వారా పారిశ్రామికాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ స్థిరంగా ముందుకు దూసుకువెళుతోందని వివరించారు. సౌదీ ఆర్మ్‌కో ప్రెసిడెంట్ సైద్ అల్ హద్రమీ స్పందిస్తూ ‘్భరత్‌కు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు మీరు చూపిస్తున్న వ్యక్తిగత శ్రద్ధను అభినందిస్తున్నానని’ చెప్పారు. కాగా సౌదీ ఆర్మ్‌కో ప్రధానంగా చమురు అనే్వషణ రంగంలో అపార అనుభవం గడించిన సంస్థ. భూమిలో చమురు, సహజవాయు నిక్షేపాలు అనే్వషణ, ఉత్పత్తి, ఎల్‌పీజీ ఉత్పత్తి, చమురు శుద్ధి, చమురు పంపిణీ, క్రూడ్ ఆయిల్ మార్కెటింగ్‌లో ఎంతో ప్రసిద్ధి చెందింది. ముఖ్యమంత్రి బృందంలో రాష్ట్ర ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు సీఈఓ జాస్తి కృష్ణకిశోర్, పరిశ్రమలశాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, వ్యవసాయ సలహాదారు టి.విజయకుమార్ ఉన్నారు.

చిత్రం..సౌదీ ఆర్మ్‌కో అధ్యక్షుడు సైద్ అల్ హద్రమీతో సమావేశమైన సీఎం చంద్రబాబు