రాష్ట్రీయం
‘పారిశుద్ధ్య కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి’
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 24 January 2018
న్యూఢిల్లీ, జనవరి 23: తెలుగు రాష్ట్రాల్లోని సఫాయి కర్మాచారుల సంక్షేమంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని అఖిల భారత సఫాయి మజ్దూర్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. హరిద్వార్లో జరిగిన అఖిల భారత సఫాయి మజ్దూర్ కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసాయి. పారిశుద్ధ్య కార్మికుల నియామకాలలో ఔట్ సోర్సింగ్ విధానాలను రద్దుచేయాలని కాంట్రాక్టు సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని ఈ సమావేశాల్లో తీర్మానించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకులు భూపతి అప్పారావు, గండెటి శ్రీనివాస్రావు, లీలాప్రసాద్, మన్మథరావు, ఆనందరావు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.