రాష్ట్రీయం

కల్తీపాల విక్రయాలపై పిల్‌ను స్వీకరించిన హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 26: తెలంగాణలో వివిధ పాల ఏజన్సీలు పాలను కల్తీ చేసి విక్రయిస్తున్నాయంటూ నల్లగొండకు చెందిన కె నర్సింహారావు అనే వ్యక్తిరాసిన లేఖను పిల్‌గా తీసుకుని విచారించాలని హైకోర్టు నిర్ణయించింది. ఈ పపాలలో ఎకోలి, సల్మానెల్లా అనే రసాయనాలు ఉంటున్నాయని, దీని వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని నరసింహారావు లేఖలో పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా నాచారంలోని రాష్ట్ర పుడ్ ల్యాబోరేటరీ కూడా ఈ విషయాన్ని నిర్ధారించిందన్నారు. ఈ విషయం పట్ల ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారన్నారు. ఈ వ్యవహారంపై ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.