రాష్ట్రీయం

సంతృప్తి.. పెరుగుతోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 29: ‘ఈ ఏడాది తొలి అర్ధ సంవత్సరంలో 11.5శాతం వృద్ధి సాధించాం, 62శాతం ప్రజల్లో సంతృప్తికి చేరుకున్నాం. ఇంకా 18శాతం సంతృప్తి సాధించాలి. ఈ స్ఫూర్తిని ఇదే విధంగా కొనసాగించాలి. 15శాతం వృద్ధి, 80శాతం ప్రజా సంతృప్తి లక్ష్యంగా అందరూ పనిచేయాలి. సక్రమంగా పనిచేస్తే 15శాతం వృద్ధి సాధించడం సులభమే’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. సోమవారం తన నివాసం నుంచి నీరు-ప్రగతి, వ్యవసాయం పురోగతిపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గత నెలలో 5శాతం సంతృప్తి ప్రజల్లో పెరిగిందని, ఏప్రిల్ నాటికి మరో 5శాతం సంతృప్తి చెందేలా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు పనిచేయాలని ముఖ్యమంత్రి కోరారు. పెన్షన్లపై సంతృప్తి గత నెలలో ఉన్నట్లే 79శాతం ఉండగా, ఈ నెలలో రేషన్‌పై సంతృప్తి 69శాతం నుంచి 76శాతానికి పెరగడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. జన్మభూమిలో వచ్చిన వినతుల పరిష్కారంపై శ్రద్ధ చూపిన అధికారులు, సిబ్బందిని అభినందించారు. జనవరి 31లోపు వినతులన్నీ పరిష్కారం అయ్యేలా కృషి చేయాలన్నారు.
ఇటీవల జరిగిన దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో ‘వ్యవసాయం-ఆహార భద్రత’పై ఫలప్రదమైన చర్చ జరిగిందని ముఖ్యమంత్రి తెలిపారు. పెట్టుబడులు లేని ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ నమూనా ప్రపంచ దృష్టిని ఆకర్షించిందన్నారు. ప్రపంచంలో మేలైన విధానాలు, మెరుగైన పద్ధతులను అధ్యయనం చేసి వాటిని రాష్ట్రానికి తెస్తున్నామన్నారు. ‘సకాలంలో సాగునీరు అందించాం, తొలకరికే సేద్యం పనులు ప్రారంభించాం, అందుకే పంట దిగుబడులు పెంచగలిగాం. ఈ ఏడాది వర్షాభావాన్ని అధిగమించి రాయలసీమ రైతాంగానికి సాగునీరు అందించడం సంతృప్తిగా ఉందని’ చంద్రబాబు అన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఈ ఏడాది వేరుశనగ దిగుబడులు గణనీయంగా పెరిగాయంటూ వేరుశనగ, మినుము, అపరాల రైతులకు మద్దతు ధర లభించేలా చూడాలన్నారు. పెరుగుతున్న పంట దిగుబడులను దృష్టిలో
ఉంచుకుని జిల్లాలలో గోడౌన్ల అందుబాటుపై కలెక్టర్లు శ్రద్ధ వహించాలన్నారు. ఎక్కడెక్కడ ఎంత విస్తీర్ణంలో గోడౌన్ల సదుపాయం ఉందో, ఎంత పెంచవచ్చో నివేదిక రూపొందించాలన్నారు. ఆక్వాలో కాలుష్యం బెడదను పూర్తిగా నిర్మూలించాలన్నారు. కాలుష్యం కారణంగా మన ఆక్వా ఉత్పత్తులకున్న ప్రాధాన్యత తగ్గే ప్రమాదం ఉందంటూ అజాగ్రత్తగా ఉంటే వృద్ధిరేటుపై గణనీయ ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. అజాగ్రత్తగా ఉన్నచోట వెనుకబడుతున్నామని, జాగ్రత్తగా ఉన్నచోట ముందంజలో ఉన్నామని సోదాహరణంగా వివరించారు.
ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల నిజం చేయాలి
‘సొంత ఇల్లు ఉండాలన్న ఆలోచన అందరిలో ఉంటుంది. వారి కల నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇళ్ల నిర్మాణానికి ప్రజల్లో డిమాండ్ అధికంగా ఉంది. ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల నిజం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని’ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 2016-17 ఎన్టీఆర్ గ్రామీణ్ ఇళ్ల నిర్మాణం 64శాతం మాత్రమే చేశారంటూ, అది 100 శాతానికి చేరుకోవాలని ఆదేశించారు. 2017-18, 2018-19 ఇళ్ల కేటాయింపులు వేగవంతం చేయాలన్నారు. ఫిబ్రవరిలో రెండవ విడత సామూహిక గృహ ప్రవేశాలు పండుగగా నిర్వహించాలన్నారు. అంగన్‌వాడీ భవనాల నిర్మాణం వేగవంతం చేయాలని, నిర్మించిన ప్రతి అంగన్‌వాడీ భవనాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
‘ఇతర రాష్ట్రాల్లో ఉపాధికి మాత్రమే నరేగా వినియోగిస్తున్నారు. మన రాష్ట్రంలో అటు ఉపాధి, ఇటు ఆస్తుల కల్పనకు నరేగా నిధులు సద్వినియోగం చేసుకుంటున్నాం. పంట కుంటల తవ్వకంలో మొదటి స్థానంలో ఉన్నాం, నరేగా నిధుల వ్యయంలో 3వ స్థానంలో ఉన్నాం. పని దినాల సంఖ్య మరింతగా పెంచుకోవాలని’ ముఖ్యమంత్రి సూచించారు. జియో ట్యాగింగ్ చేశాకే నరేగా పనులను ప్రారంభించాలని, లేకపోతే ఇబ్బందులు వస్తాయని హెచ్చరించారు. మెటీరియల్ కాంపోనెంట్ పనులు ఎక్కువ జరిగిన జిల్లాల్లో లేబర్ కాంపోనెంట్ పెంచుకోవాలన్నారు. అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కల పెరుగుదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. టెలీకాన్ఫరెన్స్‌లో వ్యవసాయ, ఉద్యాన, పశుగణాభివృద్ధి, జలవనరులు, గ్రామీణాభివృద్ధి, అటవీశాఖల ముఖ్య కార్యదర్శులు రాజశేఖర్, చిరంజీవి చౌదరి, గోపాలకృష్ణ ద్వివేది, శశిభూషణ్, జవహర్ రెడ్డి, అనంత రాము, మల్లిఖార్జునరావు, హౌసింగ్ ఎండీ కాంతిలాల్ దండే, ఆర్ధికశాఖ అధికారిణి సునీత, సెర్ప్ సీఈవో కృష్ణమోహన్, రియల్ టైం గవర్నెన్స్ ప్రతినిధి బాలాజీ, ఇతర అధికారులు, వివిధ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.