రాష్ట్రీయం

పరారీలో హెచ్‌ఎండిఏ ప్లానింగ్ డైరక్టర్ పురుషోత్తమ్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హెచ్‌ఎండీఏ ప్లానింగ్ విభాగం డెరెక్టర్ పురుషోత్తమ్‌రెడ్డి పరారీలో ఉన్నట్లు అవినీతి నిరోధక శాఖ ప్రకటించింది. ఇటీవల పురుషోత్తమ్‌రెడ్డి ఇంటికి వెళ్లిన అవినీతి నిరోధక శాఖ అధికారులకు తాళం వేసి ఉండడంతో ఆ ఇంటిని సీజ్ చేశారు. హైదరాబాద్, ఇంకా పలుచోట్ల ఆయనకు సంబంధించిన బంధువుల ఇళ్లలో సోదా నిర్వహించారు. భారీగా ఆస్తులు కూడగట్టినట్లు ఏసీబీ అధికారులు సంబంధిత పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కోర్టులో కేసు దాఖలు చేసిన ఏసీబీ అధికారులు నిందిత అధికారి కోసం గాలిస్తున్నారు. పురుషోత్తమ్‌రెడ్డి నివాసానికి సమీపంలో ఉన్న వారిని విచారించడంతో గత కొన్ని వారాలుగా వారు ఆ ఇంట్లో లేరని చెప్పినట్లు ఏసీబీ ఒక ప్రకటనలో తెలిపింది. అరెస్టు నుంచి తప్పించుకునేందుకే ఇలా ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా వెళ్లిపోయారని తెలిపింది. ఏసీబీ కేసులో నిందితుడిగా ఉన్నందున ఎవరూ ఆయనకు ఆశ్రయం కల్పించవద్దని, ఒకవేళ కనిపిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రజలు ఎవరైనా పురుషోత్తమ్‌రెడ్డిని చూస్తే తమకు సమాచారం అందించాలని విజ్ఞప్తి ఏసీబీ కార్యాలయం తెలిపింది.