రాష్ట్రీయం

28న టి టిడిపి నేతలతో చంథ్రబాబు విస్తృత స్థాయిసమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: తెలంగాణ ప్రజాసమస్యలపై పోరాటం చేయడంలో టిటిడిపి నేతలు ముందుండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. గురువారం ఆయన రాష్ట్ర టిడిపి నేతలతో టెలికాన్ఫరెన్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేసేందుకు సంస్థాగత నిర్మాణంపై దృష్టిని కేంద్రీకరించడంతో పాటు స్థానిక సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించాలన్నారు. ఈ నెల 26వ తేదీన హైదరాబాద్‌కు వచ్చి విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే విషయమై కూలంకషంగా చర్చిస్తానన్నారు. తెలంగాణలో పల్లె పల్లెకు తెలుగుదేశం కార్యక్రమం, శిక్షణ శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయన్నాని టిటిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబుకు చెప్పారు. రైతాంగ సమస్యలపై స్పీకర్,రాష్టమ్రంత్రులను టిడిపి ప్రతినిధుల బృందం కలిసినట్లు ఆయన తెలిపారు.