రాష్ట్రీయం

కన్నుల పండువగా రాఘవేంద్రుల జయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రాలయం, ఫిబ్రవరి 22: మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామి జయంతి వేడుకలు గురువారం కన్నులపండువగా జరిగాయి. మఠంలో జరుగుతున్న గురువైభవ ఉత్సవాల్లో భాగంగా గురువారం 397వ పట్ట్భాషేక మహోత్సవం, స్వామివారి 423వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వెయ్యి లీటర్ల పాలతో మూలబృందావనాన్ని అభిషేకించారు. పుష్పాలతో అలంకరించారు. పీఠాధిపతి శ్రీసుభుదేంద్రతీర్థులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. పట్టువస్త్రాలు తీసుకువచ్చిన టీటీడీ అధికారులకు మఠం అధికారులు ఘనస్వాగతం పలికారు. ఊంజల మండపంలో కొలువుతీరిన శ్రీరాఘవేంద్ర స్వామి వెండి ప్రతిమకు ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. అనంతరం నవరత్న రథంపై స్వామి వెండి ప్రతిమను ఊరేగించారు. రాష్ట్రంనుంచిగాక పొరుగున ఉన్న కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.