రాష్ట్రీయం

25నుంచి తిరుమలలో తెప్పోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 22: తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామికి వరాహ పుష్కరిణిలో 5 రోజులపాటు నిర్వహించే తెప్పోత్సవాలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు మార్చి 1 వరకు జరుగుతాయని టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు వెల్లడించారు. మొదటిరోజు శ్రీరాముల అవతారంలోనూ, రెండోరోజు శ్రీకృష్ణావతారంలోనూ, తక్కిన 3 రోజులు మలయప్పస్వామివారు తెప్పలపై విహరిస్తారన్నారు. మొదటి 3రోజుల పాటు పుష్కరిణలో స్వామివారు మూడు ప్రదక్షిణలు చేస్తూ భక్తులకు దర్శనమిస్తారన్నారు. 4వ రోజు 5 ప్రదక్షిణలు, చివరిరోజు 7 ప్రదక్షిణలు ఉంటాయని వివరించారు.