రాష్ట్రీయం

గరుడ వాహనంపై విహరించిన యాదగిరీశుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఫిబ్రవరి 25: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో ఆదివారం తొమ్మిదవ రోజు యాదగిరీశుడు శ్రీ మహావిష్ణువు అలంకారంలో గరుడవాహనంపై విహరించి భక్తులను పులకింపచేశారు. ఉదయం 11గంటలకు బాలాలయంలో ప్రధానార్చకులు నంధీగల్ నరసింహాచార్యులు, కారంపుడి నరసింహాచార్యులు, యాజ్ఞికులు సముద్రాల శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో పంచనారసింహుడిని మహావిష్ణువు అవతారంలో అలంకరించి ప్రియభక్తుడైన గరుడాళ్వార్ వాహనంపై విహరింపచేశారు. అనంతరం రాత్రి 7 గంటలకు కల్యాణమూర్తులైన శ్రీ లక్ష్మీనరసింహులను దివ్య విమాన రథంపై ఊరేగించారు. బ్రహ్మదేవుడే సారథిగా వ్యవహరించే దివ్య విమాన రథోత్సవంలో లక్ష్మీనరసింహులను దర్శించుకున్న భక్తులు పరవశులయ్యారు. భక్త జనుల సందర్శనార్థం కొండకింద వైకుంఠ ద్వారం నుండి స్థానిక ప్రచార రథంపై లక్ష్మీనరసింహులను ఊరేగించారు. మేళతాళాలు, భాజాభజంత్రీలు, బాణసంచా, భక్తుల గోవింద నామస్మరణలు, భజనలు, కళాకారుల ప్రదర్శనలతో ఈ రథోత్సవం సాగింది. స్వస్తివచనం పిదప స్వామి అమ్మవార్లను ఆలయానికి చేర్చారు. వేద పారాయణ, హోమాది పూజలు, ధార్మిక, సంగీత, సాహిత్య, సాంస్కృతిక మహాసభలు కొనసాగాయి. ఈ ఉత్సవాల్లో ఆలయ ఈవో గీత, అనువంశిక ధర్మకర్త బి.నరసంహామూర్తులు పాల్గొన్నారు. యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో పదవ రోజైన సోమవారం ఉదయం మహాపూర్ణాహుతి, చక్రతీర్థం, రాత్రి శ్రీ పుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవాలను నిర్వహిస్తారు.