రాష్ట్రీయం

రామోజీకి పద్మవిభూషణ్ ఎలా ఇస్తారు: ఉండవల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 11: పలు ఆర్ధిక నేరాలను ఎదుర్కొంటున్న ఈనాడు గ్రూపు సంస్ధల అధినేత సిహెచ్ రామోజీరావుకు పద్మవిభూషణ్ అవార్డుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు చేయడం, కేంద్రం ఈ అవార్డును ప్రకటించడంపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కోరారు. ఈ మేరకు తాను ఒక వినతిపత్రాన్ని పంపానని ఆయన చెప్పారు. రామోజీరావుకు ప్రతిష్టాకరమైన ఈ అవార్డును ఇచ్చే ముందు ఆర్ధిక నేరాలపై ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి నిర్దోషిగా తేలిన తర్వాత ఇస్తే బాగుండేదన్నారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్, మార్గదర్శి చిట్ ఫండ్స్, మెసర్స్ మార్గదర్శి మార్కెటింగ్ ప్రైవేట్ సంస్ధ, రామోజీ ఫిల్మ్ సిటీ, ల్యాండ్ సీలింగ్ చట్టం ఉల్లంఘన కింద అనేక కేసులు నమోదై ఉన్నాయన్నారు.