రాష్ట్రీయం

ఏపీపై ఏమిటీ నిర్లక్ష్యం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 13: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ చట్టం 2014లోని అంశాలు, ఆనాటి ప్రధాని ఇచ్చిన హామీల అమలులో జరుగుతున్న జాప్యం, వీటి విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపట్ల రాష్ట్ర శాసనసభ తీవ్ర అభ్యంతరం, నిరసన వ్యక్తం చేసింది. ఆ మేరకు శాసనసభలో తీర్మానం ఆమోదించింది. మంగళవారం సీఎం చంద్రబాబు స్వయంగా తీర్మానం చదివి వినిపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అశాస్ర్తియంగా జరగడంతో నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. ఆస్తులు, అప్పుల విభజనలో, విద్యుత్ పంపిణీలో, పన్నుల వసూళ్లు, తిరిగి చెల్లింపుల్లో ఆంధ్ర రాష్ట్రానికి చెప్పలేనంత నష్టం వాటిల్లిందన్నారు. విభజన చట్టం ప్రకారం రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం ఆర్థిక సాయం చేయాలని అన్నారు. రాష్ట్రానికి రైల్వేజోన్ రావాలి.. ఉక్కు కర్మాగారం స్థాపించాలి.. ఓడరేవు రావాలి.. పెట్రో కెమికల్ పరిశ్రమ ఏర్పాటు కావాలి.. నియోజకవర్గాల సంఖ్య పెరగాలి.. అనేక విద్యా, పరిశోధనా సంస్థలు ప్రారంభించాలి, ఉమ్మడి రాష్ట్రంలోని సంస్థల విభజన పూర్తి కావాలని అన్నారు. విభజన బిల్లు రాజ్యసభలో ఆమోదింప చేయడానికి ఆనాటి ప్రధాని ఆరు హామీలతో కూడిన ప్రకటన చేశారని గుర్తు చేశారు. అందులో ముఖ్యమైనవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం, ఆదాయం కోల్పోతున్న రాష్ట్రం రెవెన్యూ లోటు భర్తీ చేయడం, బుందేల్‌ఖండ్, కోరాపుట్- బోలాంగిర్- కలహండి తరహాలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక సాయాన్ని అందించడమని అన్నారు.
‘రైల్వే జోన్ ఇవ్వడం కుదరదంటున్నారు. ఉక్కు కర్మాగారం లాభసాటి కాదంటున్నారు. ఓడరేవుకు అభ్యంతరాలు పెడుతూ తాత్సారం చేస్తున్నారు. పెట్రో కెమికల్ పరిశ్రమకు సుమారు ఐదువేల కోట్ల రూపాయల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ భారం రాష్ట్రం భరించాలంటున్నారు. విద్యాసంస్థల పురోగతి మందంగా ఉంది. ఇప్పుడు ఇస్తున్న కేటాయింపులను చూస్తే ఇవి వచ్చే ఇరవై ఏళ్లకైనా పూర్తవుతాయా? అన్న సందేహం కలుగుతుంది. ఉమ్మడి రాష్ట్రంలోని సంస్థల విభజన నత్తనడక నడుస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన ఊసే లేదు. విజయవాడ, గుంటూరు పట్టణాలకు డ్రైనేజీ కోసం ఇచ్చిన డబ్బు కూడా రాజధాని అమరావతికి ఇచ్చినట్లు చూపిస్తున్నారు. యుటిలైజేషన్ సర్ట్ఫికెట్లు ఇచ్చినా ఇవ్వలేదన్నట్లు ప్రకటనలు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఇస్తున్న సాయం నామమాత్రంగా ఉంది’.
రాష్ట్రంపట్ల కేంద్రం అవలంబిస్తున్న ఈ నిర్లక్ష్య ధోరణిని శాసనసభ తీవ్రంగా ఖండిస్తోంది. ‘పోలవరం మన రాష్ట్రానికి జీవనాడి. మన ప్రజల చిరకాల స్వప్నం. ఏడు ముంపు మండలాలను మనకు బదలాయించిన తర్వాత కేంద్రం నుంచి అందాల్సిన సాయం
మందగించడం దురదృష్టకరమని శాసనసభ భావిస్తోంది. మనం ఖర్చు చేసిన సుమారు రెండున్నర వేల కోట్ల రూపాయలకు పైగా మొత్తం కేంద్రం నుంచి ఇంకా రావాల్సి ఉంది. 14వ ఆర్థిక సంఘం సిఫార్స్‌ల దరిమిలా ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని, ఇప్పుడు హోదా కలిగి ఉన్న రాష్ట్రాలకు కూడా కొనసాగించబోమనీ కేంద్రం చెప్పింది హోదా బదులు దానికి సరిసమానమైన ప్రయోజనాలు కలిగించే ప్రత్యేక సహాయాన్ని ఇస్తామన్నారు. అయితే ఈ ప్రత్యేక సహాయం నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెద్దగా రాకపోగా, ప్రత్యేక హోదా రాష్ట్రాలకు పన్ను రాయితీలు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు కొనసాగిస్తున్నారు. 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వద్దంటూ ఎక్కడా చెప్పలేదనీ, అది తమ పరిధిలోని అంశం కాదనీ ఆ సంఘం అధ్యక్షులు, సభ్యులు బహిరంగంగా చెప్పారు.’
‘ప్రత్యేక హోదా ఇవ్వద్దని ఆర్థిక సంఘం చెప్పినప్పుడు, రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రస్తుత హోదా రాష్ట్రాలకు కొనసాగిస్తున్నప్పుడు మన రాష్ట్రానికి ఎందుకు నిరాకరిస్తున్నారని కేంద్రాన్ని ఈ శాసనసభ ప్రశ్నిస్తోంది. చట్టంలో పేర్కొన్న అంశాలు, రాజ్యసభలో ఇచ్చిన హామీల అమలు అసంపూర్తిగా, ఆలస్యంగా జరగడం పట్ల రాష్ట్ర ప్రజానీకం తీవ్ర ఆగ్రహంతో ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి 29సార్లు ఢిల్లీ వెళ్లి ఈ విషయాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి పదేపదే తీసుకువెళ్లినా కేంద్రం ఉదాశీనత ప్రదర్శించింది. రాష్ట్రానికి చట్టపరంగా దక్కాల్సిన అంశాల పట్ల కేంద్ర ప్రభుత్వంలోని బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు హేళనగా మాట్లాడటాన్ని ఈ శాసనసభ తీవ్రంగా పరిగణిస్తోంది.
కేంద్రానికి రాష్ట్రంపట్ల బాధ్యత ఉంది. మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రజల అభీష్టానికి విరుద్ధంగా, అన్యాయంగా విభజన జరిగి కష్టాల్లో ఉన్న మన రాష్ట్రం పట్ల ఆ బాధ్యత మరింత ఎక్కువ. మనం నిలదొక్కుకుని, దక్షిణ భారతంలోని ఇతర రాష్ట్రాలతో సమానంగా ఎదిగేంత వరకు కేంద్రం చేయూత అందించాలి. చట్టంలో లేనివీ, పార్లమెంటు సాక్షిగా ప్రధాని ఇచ్చిన హామీల్లో లేనివీ మనం అడగడం లేదు. మనవి చట్టబద్ధమైన డిమాండ్లనీ, న్యాయమైన కోరికలనీ కేంద్రం గుర్తించి వ్యవహరించాలని కోరుతూ శాసనసభ తీర్మానిస్తున్నది.’

*
విజయవాడ, గుంటూరు పట్టణాలకు డ్రైనేజీ కోసం ఇచ్చిన డబ్బు కూడా రాజధాని అమరావతికి ఇచ్చినట్లు చూపిస్తున్నారు. యుటిలైజేషన్ సర్ట్ఫికెట్లు ఇచ్చినా ఇవ్వలేదన్నట్లు ప్రకటనలు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.