రాష్ట్రీయం

నవ భారత నిర్మాణానికి అడుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: విలంబి నామ సంవత్సరంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆశయాలకు, సంకల్పానికి కంకణబద్ధులం అవుదామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ పిలుపునిచ్చారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బిజెపి కార్యాలయంలో నిర్వహించిన పంచాంగ శ్రవణం సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ, పేదరికం, అవినీతి, ఉగ్రవాద నిర్మూళనకు ప్రధాని మోదీ రాజీలేని కృషి చేస్తున్నరన్నారు. మోదీ నేతృత్వంలో నవ భారత నిర్మాణానికి అడుగులు పడుతున్నాయన్నారు. హిందువుల పండుగల్లో ఆధ్యాత్మికతతో పాటు శాస్ర్తియత దృక్ఫతం ఉంటుందన్నారు. భావి తరాలకు దేశ సంస్కృతి, సాంప్రదాయాలతో పాటు పండుగల ప్రత్యేకతలను తెలియజేయాలన్నారు. భారతీయ సమాజంలో ప్రతి పర్వదినానికి ఓ విశిష్టత ఉంటుందన్నారు. వేదాలు, పురాణాలు, పూర్వీకుల నుంచి సాంప్రదాయకంగా వస్తున్న ప్రతీ పండుగలో శాస్ర్తియత, చరిత్ర ఇమిడి ఉందన్నారు. ఉగాది పండుగ ప్రకృతితో ముడిపడి ఉందనే విషయాన్ని షడుర్చులతో కూడిన పచ్చడి తెలియజేస్తుందన్నారు.

చిత్రం..తెలంగాణ బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో లక్ష్మణ్, దత్తాత్రేయ తదితరులు