రాష్ట్రీయం

భద్రాచలంకు 225 ప్రత్యేక బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: ఈ నెల 26న శ్రీరామనవమిని పురస్కరించుకుని టిఎస్‌ఆర్టీసీ రాష్ట్రంలోని వివిధ గమ్యస్థానాల నుంచి భద్రాచలంకు 225 ప్రత్యేక బస్ సర్వీసులు నడుపుతున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ నుంచి 30, ఖమ్మం నుంచి 45, పర్ణశాల నుంచి 44, కొత్తగూడెం నుంచి 30, మధిర నుంచి 5, మణుగూరు నుంచి 10 నడుపుతుండగా, 26న తిరుగు ప్రయాణంలో మరికొన్ని సర్వీసులు నడుపుతోంది. భద్రాచలం నుంచి రాజమండ్రి, విజయవాడ, ఏలూరు, వరంగల్, హైదరాబాద్‌లకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. కాగా షెడ్యూల్ ప్రకారం నడిచే మరో 320 సర్వీసులు వీటికి అదనంగా నడుస్తాయని ఆర్టీసీ పేర్కొంది. కొన్ని సర్వీస్‌లకు రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించినట్లు తెలిపింది.