ఆంధ్రప్రదేశ్‌

దుర్గమ్మ హుండీ ఆదాయం రూ. 2కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఇంద్రకీలాద్రి) జూలై 16: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీకనకదుర్గమ్మ సన్నిధిలో ఉన్న హుండీలను సోమవారం ఉదయం దేవస్థానం ఈవో ఎం పద్మ ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది లెక్కించగా 2కోట్ల, 3వేల, 763 రూపాయలు లభించాయి.
మల్లికార్జున మహామండపంలో సోమవారం ఉదయం వివిధ సెక్షన్‌లకు చెందిన సిబ్బంది 18 రోజులకు 26 హుండీలను లెక్కించగా రికార్డు స్ధాయిలో ఈ నగదుతోపాటు 465 గ్రాముల బంగారం, 9కిలోల 180 గ్రాముల వెండి లభించింది. ఈలెక్కింపుకార్యక్రమంలో దేవస్థానం కమిటీ చైర్మన్ వి గౌరంగబాబు, సహాయ ఈవో శ్రవణం అచ్యుతరామయ్యనాయుడు, వివిధ సెక్షన్‌లకు చెందిన సిబ్బంది, దుర్గగుడి కమిటీ ధర్మకర్తలు పాల్గొన్నారు.