ఆంధ్రప్రదేశ్‌

అభివృద్ధిపై చర్చకు పారిపోతున్న తమ్ముళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 9: ఓ వైపు రాష్ట్రం కష్టాల కడలిలో ఉందంటూనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రజల సొమ్ముతో విలాసవంతమైన ప్రయాణాలు సాగిస్తున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. టీడీపీ నేతలు అభివృద్ధిపై చర్చకు సవాళ్లు విసిరి తరువాత పరారవుతున్నారని ఎద్దేవా చేశారు. నగరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జీవీఎల్ మాట్లాడుతూ ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు పార్టీపరమైన కార్యక్రమాలకు ప్రత్యేక విమానాల్లో వెళ్లి తన వందిమాగధులతో ఖరీదైన స్టార్ హాటళ్లలో బస చేస్తున్నారన్నారు. ఇందుకు సహకరించే అధికారులను కూడా బాబుతోపాటు కోర్టుకు ఈడుస్తామని హెచ్చరించారు. దేశంలో అత్యంత సంపన్నుడు, వేలాది ఎకరాలకు అధిపతి బాబుకు పాల వ్యాపారంపై ఉన్న శ్రద్ధ పాలనపై లేదన్నారు. విశాఖ భూకుంభకోణంపై వేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ‘సిట్’ అసలు దోషులను రక్షించేందుకేనని అన్నారు. గతంలో మంత్రి అయ్యన్నపాత్రుడు విశాఖ భూకుంభకోణంలో మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పీలా గోవిందు తదితరులున్నట్లు ఆరోపించారని, తీరా తొమ్మిది నెలల తర్వాత మంత్రి మండలి ఆమోదించిన నివేదికలో వారెవరి పేర్లు లేవని అన్నారు. అసలు సిట్ అంటే సేఫ్ గార్డింగ్ ఇంటరెస్ట్స్ ఆఫ్ టీడీపీగా మారిందంటూ జీవీఎల్ ఎద్దేవా చేశారు. అగ్రిగోల్డ్ తరహాలోనే విశాఖ భూకుంభకోణంపై కూడా ఉద్యమించాలని పార్టీ కోర్ కమిటీ నిర్ణయించిందన్నారు. ఈ నెల 19 నుంచి 24 వరకు భూముల స్వాహాపై ఉద్యమాలు చేయనున్నట్లు చెబుతూ బాధితులు తమ సమస్యలను పార్టీ దృష్టికి తీసుకురావచ్చన్నారు. అగ్రిగోల్డ్ వ్యవహారంపై కేంద్రం 75 శాతం నిధులు ఇవ్వలంటూ టీడీపీ ప్రభుత్వం కొత్త పల్లవి అందుకుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా రూ.1134 కోట్లు చిన్న మదుపుదారులకు ఇచ్చివేస్తే లక్షలాది మంది బాధితులు ఊపిరిపీల్చుకుంటారని, ఆపై తాము కేంద్రంతో మాట్లాడి మిగిలిన నిధులు ఇప్పిస్తామన్నారు. రాయలసీమ అభివృద్ధిపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించేందుకు ఈనెల 18న తిరుపతిలో జరిగే పార్టీ కోర్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. కడపలో తానే ఉక్కు ఫ్యాక్టరీ పెడతానంటున్న బాబు విశాఖ రైల్వేజోన్ కూడా ఏర్పాటు చేయగల సమర్థుడంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ నాయకులు రాష్ట్భ్రావృద్ధిపై చర్చకు పిలిచి పోలీసులను అడ్డుపెట్టుకుని పరారవుతున్నారని అన్నారు.