ఆంధ్రప్రదేశ్‌

సీఎంకు కన్నా మరో 5 ప్రశ్నలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 15: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బుధవారం మరో ఐదు ప్రశ్నలు సంధించారు. ముఖ్యమంత్రి వారం వారం ఐదు ప్రశ్నలను కన్నా సంధిస్తున్న విషయం తెలిసిందే. జాతీయ హోదా కల్గిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయాన్ని చంద్రబాబు నాయుడు ఎడాపెడా పెంచుకుంటూ పోతున్నారని, పోలవరం ప్రాజెక్టుకు బిల్లుల చెల్లింపుల్లో కుంభకోణం జరగలేదా అని ప్రశ్నించారు. కడప జిల్లాలో మూతబడిన చెన్నూరు చక్కర ఫ్యాక్టరీ, పొద్దుటూరు పాల కేంద్రాన్ని తెరిపించ లేకపోవటం, పులివెందులలో రూ. 275 కోట్లతో నిర్మితమైన సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ రిసెర్చి ఆఫ్ లైవ్ స్టాక్ కేంద్రాన్ని కూడా పూర్తి స్థాయి వినియోగంలోకి తీసుకురాలేకపోవటం వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రణాళికలో రూ. 2వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నేడు నాలుగేళ్ల తర్వాత వెయ్యి రూపాయల మాత్రమే ప్రకటించడం న్యాయమా అని అడిగారు. ఏపీ జెన్కో దిగుమతి చేసుకున్న బొగ్గు దిగుమతుల్లో రూ. 200 కోట్లు ముడుపులు వాస్తవం కాదా అని కన్నా ప్రశ్నించారు. ఈ స్కాంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి సమన్లు జారీ చేయలేదా అని నిలదీశారు. మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో అన్ని స్థాయిలోనూ పచ్చ పన్ను వసూళ్ల దెబ్బకు ప్రజలు భయపడి ఇళ్ల నిర్మాణాలను కూడా వాయిదా వేయించుకోవటం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.