తెలంగాణ

అది బాబు మార్కే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 13: కాంగ్రెస్ ప్రకటించిన తొలి జాబితాలో 65 మంది కేవలం అభ్యర్థులు మాత్రమేనని, వారిలో నాయకులు ఎవరూ లేరని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణసాగరరావు పేర్కొన్నారు. మంగళవారం నాడు ఆయన పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ ఇప్పుడు ప్రకటించిన కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరూ ఏ రోజూ ప్రజాసమస్యలపై పోరాటాలు చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాను లోపాయికారిగా అమ్మేసుకుందని, దీనికి కారణం వారంతా వ్యక్తిగత కేసులు నుంచి బయటపడటానికేనని ఎద్దేవా చేశారు. గతలోనూ కాంగ్రెస్ అభ్యర్థులను తెలంగాణ ప్రజలు నమ్మలేదని, కొత్తగా కూడా నమ్మి ఓట్లు వేసేందుకు ఎవరూ సిద్ధంగా లేరని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయిన పార్టీ అని నిరూపితమైందని, ఇపుడు జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ప్రజల తిరస్కారానికి గురవడం ఖాయమన్నారు. జాబితానుబట్టి చూస్తే ఉత్తమ్ కుమార్‌రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్‌పై పట్టు లేదని తేలిపోయిందని, అలాగే ఆయన జిల్లాపైనా పట్టులేదని, మొత్తం మీద అది చంద్రబాబు జాబితాలా ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ 2019 పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయా రాష్ట్ర పార్టీ శాఖలను ఫ్రాంచైజీ ఓనర్‌షిప్ ఇచ్చినట్టు కనిపిస్తోందని, అందులో భాగంగా ఈ రాష్ట్ర కాంగ్రెస్‌ను చంద్రబాబుకు ఇచ్చినట్టుందని చెప్పారు. లోకేష్‌ను ఏపీ సీఎంను చేసి, టీఎస్‌కు చంద్రబాబునాయుడు సీఎం కారని ఎవరైనా చెప్పగలరా? అని ప్రశ్నించారు.