జాతీయ వార్తలు

హోదా కోసం ఢిల్లీలో ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంతర్‌మంతర్ వద్ద విద్యార్థి జెఏసి నిరసన
న్యూఢిల్లీ, నవంబర్ 28: ఆంధ్రప్రదేశ్‌కుప్రత్యేక హోదాను పార్లమెంట్ శీతకాలం సమావేశాల్లోనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నవ్యాంధ్ర విద్యార్థి జెఏసి శనివారం జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసింది. ప్రత్యేక హోదా ఇవ్వకుండా తాత్సారం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆంధ్రాప్రాంతానికి చెందిన రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేయాలని జెఏసి అధ్యక్షుడు ఎ అయ్యస్వామి డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో పాల్గొన్న నిరుద్యోగ పోరాట సమితి అధ్యక్షుడు శ్రీహరినాయుడు మాట్లాడుతూ కేంద్రం హోదాపై పార్లమెంట్ సమావేశాల్లో ఒక ప్రకటన చేయాలని కోరారు. డిసెంబర్ నెలాఖరులోగా స్పష్టమైన హామీ లభించకపోతే బస్సుయాత్ర నిర్వహించి ప్రజలను చైతన్యపరుస్తామన్నారు. ఆదివారం ఢిల్లీలో భిక్షాటనతో నిరసన తెలియచేస్తుందని ప్రకటించారు.