తెలంగాణ

ఎల్బీనగర్‌ విద్యార్థులు.. గోవాలో ప్రత్యక్షం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: నగరంలోని ఎల్బీనగర్‌లో అదృశ్యమైన నలుగురు విద్యార్థులు గోవా రాజధాని పనాజీకి చేరుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఎల్బీనగర్‌లోని శివగంగానగర్‌ కాలనీకి చెందిన సాయినాధరెడ్డి(14), ఉప్పల్‌కు చెందిన లిఖిత్‌కుమార్‌(13), సాయికృష్ణ(14), విజయ్‌కుమార్‌(14) ఉప్పల్‌ కేంద్రీయ విద్యాలయంలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. మంగళవారం సాయంత్రం నుంచి వీరు కనిపించకుండా పోయారు. తల్లిదండ్రులు సమీపంలోని పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. కేంద్రీయ విద్యాలయానికి వెళ్లిన తల్లిదండ్రులు అక్కడి విద్యార్థులను విచారించగా.. అగస్టు 14 నుంచి గోవా, బెంగళూరు వెళ్లాలనే ఆలోచనలో వీరు ఉన్నారని తెలిసింది. విద్యార్థుల వద్ద సెల్‌ఫోన్‌ ఆధారంగా వారు గోవాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.