సబ్ ఫీచర్

సమాచార గని.. ‘కంటెంట్ కార్పొరేషన్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాచార సాంకేతిక రంగం (ఐటీ)లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలో ప్రథమ స్థానానికి చేరుకొంది. ప్రభుత్వంలోని అన్ని శాఖలకు ‘ఈ-ప్ర గతి’ క్రమంగా విస్తరిస్తోంది. ‘ఈ-ప్రగతి’ మొదటి దశ కింద ముందుగా 14 శాఖల అనుసంధాన ప్రక్రియ అధికారులు పూర్తిచేస్తారు. రెండు, మూడు దశల్లో భాగంగా మిగిలిన శాఖలను కూడా అనుసంధానం చేస్తారు. ఇన్నోవేషన్ హ్యాక్‌థాన్, ఆర్టీజీ, ఫైబర్‌గ్రిడ్, ఐవోటీ పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది. డెవలప్‌మెంట్ ప్లాట్‌ఫామ్, బిగ్ డేటా ప్లాట్‌ఫామ్ ఇప్పటికే పూర్తయ్యాయి. ‘ఈ-ప్రగతి’ ద్వారా ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది. పంచాయతీరాజ్, వ్యవసాయ, రెవెన్యూ, పట్టణాభివృద్ధి, పరిపాలన తదితర శాఖలలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం వల్ల పనులలో వేగం పెరిగింది. ప్రజల సంతృప్తిని కొలిచేందుకు కూడా ‘ఈ-ప్రగతి’ దోహదపడుతుంది. ఇదంతా ఒక ఎత్తయితే సమాచారం మొత్తం ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం మరో ఎత్తు.
అన్ని శాఖల సమాచారం అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సమాచార విప్లవానికి స్వాగతం పలుకుతోంది. ప్రజలకు నిత్యం అవసరమైన ప్రభుత్వ శాఖలలో వివిధ అంశాలకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంటుంది. అభివృద్ధికి దారితీసిన అంశాలు, అభివృద్ధిక్రమం, వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాలలో నూతన పోకడలకు సంబంధించి సమగ్ర సమాచారం అటు ప్రభుత్వ అధికారులకు, ఇటు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ‘కంటెంట్ కార్పొరేషన్’ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 2న రాష్ట్ర రాజధాని అమరావతిలో జరిగిన మంత్రి మండలి సమావేశం ఏపీ కంటెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. ఏపీ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ (ఏపీఎస్‌ఎఫ్‌ఎల్)కు అనుబంధంగా ఈ సంస్థను ఏర్పాటు చేశా రు. దీనికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లతోపాటు సీఈఓని కూడా ప్రభుత్వం నియమించింది. ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఈ ‘కంటెంట్ కార్పొరేషన్’కు చైర్మన్- మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా వ్యవహరిస్తారు. ఆర్థిక, విద్యుత్, వౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, విద్య, వైద్య, వ్యవసాయ, సహకార శాఖల అదనపుకార్యదర్శి లేక జాయింట్ సెక్రటరీ లేక డిప్యూటీ సెక్రటరీ ఇందులో సభ్యులుగా ఉంటారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్స్, సమాచార పౌర సంబంధాల శాఖలనుంచి ఒక్కొక్కరిని ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. కంటెంట్ కార్పొరేషన్ సీఈఓ కూడా ఒక డైరెక్టర్‌గా ఉంటారు. ప్రతి మనిషికి సమాచారం, విషయ పరిజ్ఞానం ప్రాథమిక అవసరంగా ప్రభు త్వం గుర్తించింది. నవంబర్ 30న జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటెంట్ కార్పొరేషన్ రూ పొందించిన ‘పోర్టల్’ను ప్రారంభించారు. కొద్దిరోజుల్లోనే ఇది ప్రజలకు అందుబాటులోకి వస్తుంది.
ప్రభుత్వ శాఖలు, వివిధ అంశాలకు సంబంధించిన సమస్త విజ్ఞాన సమాచారాన్ని ఈ కార్పొరేషన్ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చారు. వాస్తవానికి ఇది ఓ సమాచార గని. రాష్టవ్య్రాప్తంగా, దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్పొరేషన్ విస్తృత స్థాయిలో సమాచారాన్ని సేకరిస్తుంది. ఉదాహరణకు వ్యవసాయ రంగంలో పొలం దున్నడం దగ్గర నుంచి వ్యవసాయ ఉత్పత్తులు చేతికి రావడం, ఆ ఉత్పత్తులకు డిమాండ్ ఉన్న ప్రాంతాలు, రవాణా, మార్కెటింగ్ వంటి అంశాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మార్పులు, సాంకేతిక సమాచారం, ఎరువులు, పురుగు మందులు లేని ప్రకృతి వ్యవసాయం, ఉత్పత్తుల నాణ్యత.. వంటి సమగ్ర సమాచారం సేకరించి అందుబాటులో ఉంచుతుంది. ఇదే రీతిలో చిన్న, పెద్దతరహా పరిశ్రమలు, విద్యుత్, పర్యాటక, నిర్మాణరంగం, సేవల రంగాలు, రెవెన్యూ, విద్య, వైద్యం, కుటుంబ సంక్షేమం, కార్మిక, ఆర్థిక మొదలైన అన్ని శాఖల సమాచారాన్ని ఒక్క ‘క్లిక్’తో ఎవరైనా తెలుసుకొనే అవకాశం ఉంటుంది.
సమాచారం పుస్తకం రూపంలో, మాస, వార, దిన పత్రికలలో, డాక్యుమెంట్ల రూపంలో సమాచార, పౌర సంబంధాల శాఖ వద్ద, ఇంకా ఇతరత్రా ఉంటుంది. అంతేకాకుండా చాలామందికి తెలియకుండా కూడా వివిధ రూపాలలో రాష్ట్రంలో ఎంతో సమాచారం గుప్తంగా ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి కూడా చాలామందికి తెలియదు. అటువంటి మొత్తం సమాచారాన్ని ఈ కార్పొరేషన్ సమగ్రంగా సేకరిస్తుంది. అన్ని రకాల సమాచారాన్ని సేకరించి, ఒకచోట చేర్చి అందరికీ అందుబాటులో ఉంచడమే ఈ కార్పొరేషన్ పని. ఒక్క మాటలో చెప్పాలంటే సమాచార సేకరణకు ఇది సింగిల్ సోర్స్ విజ్ఞాన బాంఢాగారం. ప్రతి ఒక్కరికి తాము చేసే రంగాల్లో అభివృద్ధిని, అవసరమైన సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దేశంలో ఈ తరహాగా విజ్ఞానాన్ని అందించే కార్పొరేషన్ మరే రాష్ట్రంలోనూ లేదు. ఈ పోర్టల్ అందుబాటులోకి వస్తే ఉన్నత చదువుల ప్రవేశపరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు, ఉపాధి అవకాశాల కోసం వివిధ రకాల పోటీ పరీక్షలు రాస్తే అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సమాచారం దాపరికానికి తావుండదు. సమాచార సాంకేతిక రంగంలో ముందడుగుగా దీనిని భావించవచ్చు.

-శిరందాసు నాగార్జున 94402 22914