సబ్ ఫీచర్

స్వరాజ్య సంస్థాపకుడు శివాజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మప్రతిష్ఠాపనే లక్ష్యంగా, కర్తవ్య పరాయణత్వ మే ధ్యేయంగా జీవించి ధన్యుడైన వారిలో నిత్యస్మరణీయుడు ఛత్రపతి శివాజీ. అందుకే ‘శివాజీ స్వరూపానే్న ధ్యానించండి, ఆయన ప్రతాపానే్న అనుష్ఠించండి’ అని సమర్థ రామదాసు వంటి మహనీయులు మన జాతికి ప్రబోధించారు. హిందూ ధ్వజాన్ని మళ్ళీ ఉత్తుంగ శిఖరాలపై ఎగురవేసి, హిందూత్వంలో అమృతాన్ని నింపి ప్రాణప్రతిష్ఠ చేసిన మహనీయుడు శివాజీ. మహారాష్ట్ర ప్రాంతంలో యాదవులు స్థాపించిన హిందూ సామ్రాజ్యం 1307 మార్చి 24తో ఢిల్లీ సుల్తాను ఖిల్జీ ద్వారా నాశనం కాగా, ఆ తర్వాత 350 ఏళ్ల వరకూ మరో హిందూ సామ్రాజ్యమే లేకుండా పోయింది.
1630 ఫిబ్రవరి 19వ తేదీన భావి హైందవ సామ్రాజ్య నిర్మాతయైన శివాజీ జన్మించాడు. దేశభక్తిని ఉగ్గుపాలతోనే రంగరించుకున్న శివాజీ తన తల్లి జిజియాబాయి పెంపకంలో అనేక విషయాలు నేర్చుకున్నాడు. ‘రామరాజ్యం వంటి హైందవ సామ్రాజ్యం నిర్మాణం చేయాలనే కోరిక’ శివాజీలో బాల్యంలోనే స్థిరపడింది. శివాజీ జాగీరులో రాంఝా గ్రామ పటేలు ఒక స్ర్తిని బలత్కారం చేయగా, శివాజీ 1645 జనవరి 28న పటేలును బంధించి, కాళ్ళు చేతులు నరికించి శిక్షించాడు. అలా క్రమంగా ప్రజల అభిమాన పాత్రుడైనాడు. అప్పట్లో కాశ్మీరం నుండి కావేరీ వరకు మధ్యనున్న చాందా, గోండువనం వదిలి మిగిలిన దేశమంతా తురుష్కుల అధీనంలో ఉండేది.
దేవగిరి, విజయనగరం రాజ్యాలు అస్తమించాక, శివాజీ తన మిత్రులందరితో భవిష్యత్ సామ్రాజ్య నిర్మాణం కోసం దేవాలయం, కొండగుహ, కీకారణ్యం, ఇసుకతినె్నలు వంటి అనేక ప్రాంతాల్లో చర్చోపచర్చలు జరిపేవాడు. మొదట బీజాపూర్ సుల్తాన్‌చే నిర్లక్ష్యం కాబడిన ‘కాన’ లోయలోని ‘తోరణ’ దుర్గాన్ని జయించి, హిందూ సామ్రాజ్య నిర్మాణానికి తోరణం కట్టాడు. తోరణ దుర్గానికి ఎదురుగా ఉన్న ‘మురుంబదేవ’ గిరిపై కొత్త కోటను నిర్మించి, ‘‘రాజ్‌గఢ్’’ అని పేరు పెడ్డాడు. తర్వాత ‘కువారి’ కోటను వశం చేసుకున్నాడు. ఇవన్నీ పదహారేళ్ళ ముక్కుపచ్చలారని ప్రాయంలో శివాజీ చేసిన గొప్ప పనులు. తర్వాత కొండణాకోటను తన స్వరాజ్యంలో కలుపుకున్నాడు. శివరళ, సుభానుమంగళి దుర్గాలను వశపరుకున్నాడు. 1648 జూలై 25న వజీరు ముస్త్ఫా, బాజీ ఘోర్పడేలు సైన్యంతో శివాజీ తండ్రి అయిన శహాజీని బంధించారు. శత్రువును శరణు వేడడమా? తండ్రి ప్రాణమా? స్వరాజ్యమా? అనే శివాజీ ప్రశ్నలకు తల్లి జిజియాబాయి- తన మాంగల్యం కన్నా దేశభక్తి గొప్పదని చెప్పింది.
పురంధర కోటలో ఉన్న శివాజీ సైన్యానికి, ఫతేఖాన్ సైన్యానికి భీకర యుద్దం జరగగా శివాజీకే విజయం దక్కింది. 1648 ఆగస్టు 8న ఫతేఖాన్ ఓటమి పాలయ్యాడు. పురంధర దుర్గంలో ఫతేఖాన్, బెంగుళూరులో ఫరాదఖాన్ ఓటముల పాలు కాగా, బీజాపూర్‌లో శివాజీ తండ్రి శహాజీ 1649 మే 16న బంధ విముక్తుడైనాడు. 1654 మే 23న బీజాపూర్ సుల్తాన్ మహరాజ్‌పంత్ మరణించగా, ఆయన నలుగురు కుమారుల తగవుల కారణంగా శివాజీ వారిని బంధించి, ఉచిత పదవులు కట్టబెట్టి, నేతాజీ పాల్కర్ అనే సర్దార్‌ను అధికారిగా నియమించాడు. కృష్ణానదీ సమీపంలో టావళి అధిపతి దౌలత్‌రావు మృతి చెందగా, ఆయనకు సంతానం లేకపోగా, దత్తపుత్రుడైన యశ్వంతరావుకు పదవినిచ్చాడు. తన అధికారానికి ఇష్టపడని కారణాన 1656లో యుద్దంలో యశ్వంతరావును ఓడించి శివాజీ స్వరాజ్యంలో కలుపుకున్నాడు. దీనిలో అంతర్భాగ కొండ ప్రాంతమైన ‘రాయరి’ కోటనే కొనే్నళ్ళకు శివాజీ రాజధానిగా రాయగఢ్ దుర్గం ఏర్పడింది. 1956 నవంబర్ 2న బీజాపూర్ సుల్తాన్ ఆదిల్‌షా చనిపోగా, మొగలు సామ్రాజ్య దక్షిణ సుబేదారైన ఔరంగజేబు అనుమతిని పొంది, 1957 ఏప్రిల్ 23న స్వరాజ్యంలో కలుపుకున్నాడు.
బీజాపూర్ ప్రాంతం నుండి కోండ్వానా కొంకణ, దండరాజపురి, భీవండి, కళ్యాణి, మాహు తదితర కోటలను పోర్చుగీసు వారి నుండి చోళ ప్రాంతాన్ని శివాజీ జయించాడు. కటావ్, మయణి, అష్టి, ఖరాహడ్, సుపే, కొల్హాపూర్, పనాళిగఢ్, యెగావ్ తదితర కోటలను జయించాడు. ఔరంగజేబు సలహాదారులైన కారతలబ్ ఖాన్, నామదర్ ఖాన్, ఇనాయత్ ఖాన్, షహిస్త ఖాన్, భావసింహ, జస్వంత సింహ తదితరులను ఓడించాడు. అహ్మద్‌నగర్, సూరత్, జున్నర్ నగరాలను లూటీ చేశాడు. అలా సాగిన శివాజీ తన జైత్రయాత్ర ఫలితంగా 1674 జూన్ 6న సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆంగ్లేయుల రాయబారి హెన్రీ ఆక్సెండర్ శివాజీ మహారాజుకు ప్రణమిల్లి భారీగా కానుకలు సమర్పించాడు. తన రాజ్యానికి అష్టప్రధానుల పారశీక నామాలను మార్చి సంస్కృత పేర్లను శివాజీ పెట్టాడు. ప్రభుత్వ పాలన సంస్కృతంలోనే సాగాలని రాజ్య వ్యవహార కోశం తయారు చేయించాడు. ముప్పై సంవత్సరాలు శివాజీ, ఆయన అనుచరులు చూపిన పరాక్రమాలు, కర్తృత్వ శక్తి, త్యాగశీలత, ధ్యేయ నిష్ఠ హిందువులలో నూతనోత్తేజం నింపాయి. యాభై ఏళ్ళ సామ్రాజ్య నిర్మాణ కృషి ఫలితంగా దేహం పూర్తిగా అలసిపోగా ఆరోగ్యం క్షీణించడంతో, 1680 ఏప్రిల్ 3న శివాజీ తుది శ్వాస విడిచాడు.

-సంగనభట్ల రామకిష్టయ్య