సబ్ ఫీచర్

క్యారీబ్యాగ్‌కు డబ్బులిస్తున్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షోరూంలోకానీ, సూపర్ మార్కెట్లలో కానీ బట్టలు, సామాన్లు కొన్న తరువాత వాటిని పెట్టుకోడానికి సంచి తెచ్చారా లేదా ఇవ్వమంటారా? డబ్బులు పెట్టి కొనుక్కోమని చెబుతుంటారు. ఒక్కో బ్యాగ్‌కు షాపు వారు మూడు నుంచి ఐదు రూపాయలు వసూలు చేస్తారు. కొన్నిసార్లు కొంతమంది క్యారీ బ్యాగ్ కొనకుండా వస్తువులు చేతిలో పట్టుకుని తీసుకుని వచ్చేస్తుంటారు. ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం విధించినప్పటి నుంచి కంపెనీలు డబ్బులు తీసుకుని క్యారీబ్యాగ్‌లు ఇచ్చే పద్ధతి మొదలైంది. మనం కూరగాయలు కొన్నప్పుడు లేదా చిన్న చిన్న సామాన్లు కొన్నప్పుడు వాటికోసం బ్యాగ్ తీసుకెళ్లడానికి ఏ సమస్యా ఉండదు. కానీ ఖరీదైన సామాన్లు కొంటున్నప్పుడు బ్యాగ్ కోసం డబ్బులు తీసుకోవడం సరికాదు. ఇది డబ్బులు సంపాదించే పద్ధతిగా మారిపోయింది. తరచూ షోరూంలో కొన్న సామాన్లు పెట్టుకోడానికి క్యారీ బ్యాగ్ కోసం డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. వద్దని మీరు చెబితే మీ సామాన్లు పెట్టుకోడానికి ఎలాంటి బ్యాగ్ ఇవ్వరు. అలాగే ఇటీవల ఓ వ్యక్తి చండీగఢ్‌లో ఓ షోరూంలో మూడు రూపాయలకు క్యారీ బ్యాగ్ కొన్నాడు. కానీ దానిపై అతడు వినియోగదారుల ఫోరం(కంజ్యూమర్ కోర్టు)కు వెళ్లాడు. ఫోరం ఆ కంపెనీకి తొమ్మిది వేల రూపాయల జరిమానా విధించింది. అందులోంచి బాధితుడికి నాలుగు వేల రూపాయల పరిహారం లభించింది. వివరాల్లోకి వెళితే..
చండీఘడ్ వాసి ప్రసాద్ అనే అతను 2019, ఫిబ్రవరి 5న ఓ షోరూంలో బూట్లు కొనుక్కున్నాడు. కౌంటర్ దగ్గరకు వెళితే అవి పెట్టుకోవడానికి క్యారీ బ్యాగ్ కోసం ఆయనను డబ్బులు అడిగారు. లేకపోతే బూట్లను చేత్తో పట్టుకుని వెళ్లమని చెప్పారు. అందుకు అతను ఒప్పుకోలేదు. క్యారీబ్యాగ్ ఇవ్వడం కంపెనీ బాధ్యత అని చెప్పాడు. వాళ్లు ఒప్పుకోలేదు. అయితే చివరకు ఏ ప్రత్యామ్నాయం లేక ఆయన క్యారీబ్యాగ్ కొని అందులో బూట్లు పెట్టుకుని వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రసాద్ దీనిపై చండీగఢ్‌లోని జిల్లా స్థాయి వినియోగదారుల ఫోరంకు ఫిర్యాదు చేశాడు. బ్యాగ్‌కు డబ్బులు వసూలు చేయడం సరికాదని అందులో వివరించాడు. ఆ ఫిర్యాదుపై విచారణ తర్వాత వినియోగదారుల ఫోరం ప్రసాద్‌కు అనుకూలంగానే తీర్పు ఇచ్చింది. బ్యాగ్‌కు వినియోగదారుడి నుంచి మూడు రూపాయలు వసూలు చేయడం తప్పని చెప్పింది. దీనితో పాటు ప్రసాద్ ఎదుర్కొన్న మానసిక, శారీరక వేధింపులకు మూడు వేల రూపాయల పరిహారం ఇవ్వాలని కూడా ఆ కంపెనీకి సూచించింది ఫోరం. దానితో పాటు కేసు ఖర్చులను భర్తీచేయడానికి మరో వెయ్యి రూపాయలు కూడా ఇవ్వాలన్న ఫోరం.. ఆ కంపెనీకి శిక్షార్హమైన పరిహారంగా వినియోగదారులకు న్యాయ సహాయం చేసే ఖాతాలో మరో రూ. ఐదు వేలు జమ చేయాలని ఆదేశించింది.
వినియోగదారులందరికీ డబ్బు తీసుకోకుండా క్యారీబ్యాగ్ ఇవ్వాలని, వ్యాపారంలో అన్యాయంగా ఉండే పద్ధతులు పాటించవద్దని ఫోరం ఆ కంపెనీని హెచ్చరించింది. కానీ చాలామంది వినయోగదారులు సామన్లతో పాటు క్యారీబ్యాగ్‌కు కూడా డబ్బులు చెల్లిస్తుంటారు. కానీ అది తక్కువ మొత్తం కావడంతో కోర్టు వరకూ ఎవరూ వెళ్లరు. ఇప్పుడు ఈ కేసులో తీర్పు వినియోగదారుల పక్షంలో రావడం చాలా ముఖ్యమైన విషయంగా అందరూ చెబుతున్నారు. అంతేకాదు ఫోరం తన ఆదేశాల్లో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే.. ‘క్యారీబ్యాగ్‌పై రాసిన కంపెనీ పేరుపై ఫోరం అభ్యంతరం వ్యక్తం చేయడం’. ప్రసాద్ లాయరు మాట్లాడుతూ ‘బ్యాగ్‌పైన కంపెనీ పేరు రాసింది. మనం దాన్ని తీసుకుని వెళ్లినప్పుడు అది కంపెనీకి ప్రచారం అవుతుంది. ఒకవిధంగా కంపెనీ తన ప్రచారం కోసం మన నుంచి డబ్బు తీసుకుంటోంది’ అని చెప్పాను. వినియోగదారుల ఫోరం పిటిషనర్ల వాదనతో ఏకీభవించింది. దానిని ప్రచారం చేసే పద్ధతి అనే చెప్పింది. ఫోరం తన ఆదేశాల్లో ‘్ఫర్యాదులో చెప్పిన క్యారీబ్యాగ్‌ను మేం చూశాం. దానిపై ఉన్న ప్రకటనలో ఆ కంపెనీకి చెందిన కాప్షన్ కూడా ఉంది. ఈ కారణంగా కంపెనీ వినియోగదారుడిని ఆ ప్రకటనకు ఏజెంటులా ఉపయోగించుకుంటోంది’ అని రాసింది. వినియోగదారుల హక్యుల కార్యకర్త పుష్ప కూడా వినియోగదారులకు ఉచితంగా క్యారీబ్యాగ్ ఇవ్వడం కంపెనీల బాధ్యత అని చెప్పింది. మనం ఏవైనా సామన్లు కొంటున్నప్పుడు వాటిని అలాగే చేతిలో పట్టుకుని వెళ్లలేం కదా.. అందుకే బ్యాగ్ ఇవ్వడం అవసరం. మనం ఆ షాపులో సామాన్లు కొంటున్నప్పుడు క్యారీబ్యాగ్ ఇవ్వడం షాపు వారి బాధ్యత. అందుకోసం షాపువాళ్లు డబ్బులు తీసుకోవడం తప్పు. అయితే ఈ ఫిర్యాదుపై కంపెనీ మాట్లాడుతూ ‘తాము పర్యావరణాన్ని రక్షించడానికే ఇలా చేస్తున్నాం’ అని చెప్పింది. అలాంటప్పుడు కంపెనీ క్యారీబ్యాగ్ ఉచితంగా ఇవ్వాలని ఫోరం సూచించింది. ఈ కేసులో క్యారీబ్యాగుపై కంపెనీ పేరు రాసుండటం వల్ల అది ప్రచారం కేసుగా మారింది. బ్యాగ్‌పై కంపెనీ పేరు లేకుంటే అది మామూలు పేపర్ బ్యాగ్ అయ్యుంటే డబ్బులు తీసుకోవచ్చా? అనే సందేహం వస్తే..
అలాంటప్పుడు కూడా డబ్బులు తీసుకోవడం తప్పేనని ఫోరం చెబుతోంది. ఏ షోరూంలోనైనా లోపలికి బ్యాగ్‌ను అనుమతించరు. దానివల్ల బ్యాగ్ ఎక్కడకు తీసుకెళ్లచ్చో, ఎక్కడకు తీసుకెళ్లకూడదో తెలీదు. చాలాసార్లు జనం తమతో బ్యాగ్ తీసుకుని కూడా వెళ్లరు. అందుకే బ్యాగ్‌ను షాపు వాళ్లు ఉచితంగానే ఇవ్వాలి. ఒక వినియోగదారుడు న్యాయం కోసం ఇలా చేయడం చాలా మంచి విషయం. దీని ప్రభావం మిగతా కంపెనీలపై కూడా పడుతుంది. వేరే కేసులో కూడా దీన్ని ఓ సందర్భంగా తీసుకోవచ్చు. దీనివల్ల క్యారీబ్యాగ్ కోసం కచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని నిరూపితమవుతుంది. ఇకముందు షాపులు ఇలా డబ్బులు వసూలు చేయకుండా అడ్డుకోవడానికి కోర్టు ఆదేశాలతో పాటు ప్రజల అభ్యంతరాలు కూడా అవసరం. ప్రజలు షాపులకు వెళ్లి క్యారీబ్యాగ్ ఇస్తారా, ఇవ్వరా? అని అడగడం మొదలుపెడితే.. దాన్ని బట్టే షాపింగ్ చేస్తే కంపెనీలపై ఆ ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఆడవాళ్లు ఎక్కువగా సూపర్ మార్కెట్లకు వెళుతుంటారు కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఇలాంటి దోపిడీలను అరికట్టాలి.