సబ్ ఫీచర్

మత సహిష్ణతకు మారుపేరు భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా దేశానికి చెందిన ‘మత స్వేచ్ఛా సంస్థ’ ఇటీవల విడుదల చేసిన తన వార్షిక నివేదికలో భారతదేశంలోని హిందూ అతివాద శక్తులు మైనారిటీ వారిపై ముఖ్యంగా ముస్లింలపై దాడులు జరుపుతున్నారని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. సర్వమత సమభావనతో, సర్వకుల సమ్మేళనంతో సర్వసత్తాక ప్రజాస్వామ్య వ్యవస్థలో సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, ఆర్థిక, రాజకీయపరంగా భారత్‌లో విభిన్న మతాల వారు సహజీవనం చేస్తున్నారు. నూట ముప్ఫై కోట్ల భారతీయ ప్రజలు భాషాపరంగా కొన్ని రాష్ట్రాలను ఏర్పాటు చేసుకొన్నా- ఒకే జాతిగా కొనసాగుతున్న దేశం భారత్.
సృష్టిలో భూమి పుట్టుక అనేది భారత భూభాగం నుండే జరిగింది. ఋషులనబడే జ్ఞానులు ద్వారా మానవాళి, జీవకోటి సుఖఃసంతోషాలకు మార్గదర్శనం విశాల భూభాగంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారి వారి భాషలకు సంబంధించిన సాహిత్యం అప్పుడే భారత ప్రజలకు ప్రాప్తించినది.
భారతదేశంలో హిందూ ధర్మం, హిందూ సంస్కృతి, హిందూ మతంగా కొనసాగుతున్న ‘సనాతన’ ధర్మంలో భగవంతుడిని ఎవరికి నచ్చిన రూపంలో పేరుతో, పూజావిధానాలు, నైవేద్యం అర్పణతో ఆరాధించే స్వేచ్ఛ ఉన్నది. అందులో భాగంగానే శైవులు, వైష్ణవులు, శాక్తేయులు, గాణాపత్యులు, స్కాందులు అనే వర్గాలున్నా వీరంతా దేశ పౌరులుగా చెప్పుకొనేవారు. ఈ మతాలకు సంబంధించిన దేవీదేవతల మధ్య కుటుంబ వ్యవస్థ ఉన్నది. కాని వేరు వేరు కాదు. ఇలాంటి మతాలనే వైదిక మతాలు అనేవారు. ఈ మతాలు సనాతనమైనవి. వీటికితోడుగా జైనము, బౌద్ధము, సిక్కు తదితర మతాలు కూడా భారతదేశంలో పురుడు పోసుకున్నవి.
విదేశాల బర్బరుల నుండి సృష్టించబడిన మతాలు ఇస్లాం, క్రైస్తవం. వీటికితోడు మతం కాని మతం కమ్యూనిజం. అనాదిగా భారతదేశంలో కొనసాగుతున్న మతాలు, వాటికితోడు మధ్యలో పుట్టుకొచ్చిన మతాలన్ని భారతదేశంలోనివి కాబట్టి వాటిమధ్య విబేధాలు లేవు. సామరస్యభావనతో సహజీవనం జరుగుచున్నది. సృష్టిలోని జీవకోటి సుఖంగా ఉండాలనేదే ఆకాంక్ష. కాని విదేశీ మతాలకు అంటే ఇస్లాం, క్రైస్తవం, కమ్యూనిజానికి ప్రాణికోటి సుఖజీవనం కంటే ఆయా మతాలు ప్రపంచవ్యాప్తంగా ఒకే మతం కొనసాగాలన్నదే వాటి లక్ష్యం. అందుకే ఆయా మతాలవారు మత ప్రచారాలు చేయడం, మతమార్పిడులు ప్రోత్సహించడం జరుగుతోంది. వి విధ మతాల మధ్య మత యుద్ధాలు జరుగుతుంటాయి.
భారతదేశం స్వాతంత్య్రం పొం దిన నాటినుండి 2014వరకు సెక్యులర్ ముసుగులో దేశాన్ని అత్యధిక కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీకి తోక పార్టీలుగా కొనసాగాయి కమ్యూనిస్టు పార్టీలు. ఇలాంటి పార్టీలన్నీ విదేశీ సిద్ధాంతాలకు, మతాలకు అమ్ముడుపోవడమే కాదు, భారతీయ అస్థిత్వాన్ని భ్రష్టుపట్టించినారు. ప్రజాసేవ పేరుతో విదేశీ మత సంస్థల ద్వారా వచ్చే డబ్బుతో భారతదేశంలో స్వచ్ఛంద సేవా సంస్థలు (ఎన్‌జిఓలు) పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి విదేశీ మతాలలోనికి మత మార్పులు చేయడం యథేచ్ఛగా జరుగుచున్నది.
మతమార్పులు చేసేందుకు సులభతరమైన దారులు ఏర్పాటు నిమిత్తం దళితుల, ఆదివాసీలు, మూలవాసీలు హిందువులు కాదని, భారతదేశంలో గౌరవార్థం పిలిచే ఆర్యశబ్దాన్ని ఆర్యజాతిగాని, ద్రవిడ ప్రాంతంగా కొనసాగిన ప్రాంతాన్ని ద్రవిడ జాతిగా చిత్రీకరించి, ప్రచారం చేసి భారతీయులలో బేధాభిప్రాయాలను సృష్టించారు. వీటిద్వారా వారి తమ పబ్బం గడపడం నేర్చుకున్నారు.
2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుండి ఎన్‌జిఓలకు మత సంస్థల నుండి వచ్చే విదేశీ డబ్బుకు చెక్ పెట్టడం జరిగింది. విదేశీ డబ్బుతో జల్సాలు చేసే స్వదేశీయులకు నరేంద్ర మోదీ పాలన మింగుడు పడడం లేదు. నరేంద్ర మోదీ జాతీయ నిష్ట, దేశాభివృద్ధి, ప్రపంచ శాంతికి చేస్తున్న కృషికి ప్రపంచ దేశాలు ఎర్ర తివాచీ పరచడం, ప్రపంచంలోనే శ్రేష్ట పరిపాలకుడిగా మోదీ కీర్తించబడడం కుహనా సెక్యులరిస్టులకు, కమ్యూనిస్టులకు, మతం మారిన ధర్మద్రోహులకు మింగుడుపడటం లేదు. అందులో భాగంగా దేశంలో ఎక్కడో ఒకచోట వీరు నిరంతరం అసహిష్ణుత పేరుతోను, మూకదాడుల (లించింగ్) పేరుతో జాతీయ పౌరసత్వ జాబితా (ఎన్‌ఆర్‌సి) అడ్డుకునే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వంపై అపవాదు మోపుతుంటారు. కేరళ రాష్ట్రంలోను, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోను నిరంతరం మారణహోమాలు, హిందువులపై హత్యలు జరుపుతూ ఉంటారు. కశ్మీర్‌లో నిరంతరం సైనికులపై రాళ్లు రువ్వే అల్లరి మూకలను ప్రోత్సహిస్తుంటారు. తీవ్రవాదుల దాడులు కొనసాగుతుంటాయి. ఇవేవీ అమెరికాలోని మత స్వేచ్ఛసంస్థకు కనిపించవు. వీరికి సమాచారం కూడా ఉండదు.
భారతదేశంలో హజ్ యాత్రకు పోయే ముస్లింలకు ‘సబ్సిడీ’ ఇస్తున్నది ప్రభుత్వం. కాని తమ పుణ్యక్షేత్రాలకుపోయే హిందువులకు ప్రభుత్వం ఏమీ ఇవ్వడం లేదనేది గుర్తించాలి. ‘లవ్ జిహాద్’ పేరుతో ముస్లిం యువకులు హిందూ అమ్మాయిలకు వల వేసి మత మార్పిడులు చేస్తున్నారు. ఇవి కూడా అమెరికాలోని మత స్వేచ్ఛాసంస్థకు కనిపించవు. కాని సామూహికంగా భారతదేశంలో అతివాద హిందువులు ముస్లింలపై దాడులు జరుపుతున్నారని విస్తృత ప్రచారం చేయడం ఎంత కుట్ర పూరితమైనదో ప్రజలు గుర్తించాలి. ప్రపంచంలో అనేక మత రాజ్యాలు ఉన్నప్పటికీ ఆయా రాజ్యాలలో తెగల మధ్య, జాతుల మధ్య నిరంతరం దాడులు జరుగుతూనే ఉంటాయి. అమెరికాలో హోటళ్లపై, సూపర్ మార్కెట్లపై, పాఠశాలలపై, పార్కులలో నిరంతరం తుపాకులు మోతమోగుతూనే ఉంటుంది. అనేకమంది ప్రాణాలు కోల్పోతూనే ఉంటారు. ఇవి ఏవీ అమెరికా మత స్వేచ్ఛసంస్థకు కనిపించవా? ఈ సంస్థవారు ఉన్మాదాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నారా?
భారతదేశంలోని సనాతన ధర్మంలోని వైదిక మతాలు అనేకమున్నాయి. ఆ మతాల సహిష్ణతవల్లనే విదేశీ బర్బర మతాలైన ఇస్లాం, క్రైస్తవ మతాలు వారివారి ఆచార వ్యవహారాలు, పండుగలు, ఉత్సవాలు స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో నిర్భయంగా వందల సంవత్సరాలనుండి కొనసాగించుకొంటున్నారు.
భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర దేశము. ఈ దేశంలో అన్ని మతాలకు సంబంధించిన స్ర్తి పురుషులు, బీదవారు, సంపద ఉన్నవారు చివరకు బిచ్చగాళ్లుకూడా ఓటుహక్కు కలిగి ఉన్నారు. సార్వత్రిక ఎన్నికలలో పోటీచేసే స్వతంత్రమున్నది.
నూట ముప్ఫై కోట్ల జనాభాగల భారతదేశం అనేక కులాలు, మతాలు, భాషలు ఉన్నప్పటికీ ఇక్కడ ప్రజాస్వామ్యం పరిఢవిల్లుచున్నది. ‘ముమ్మార్ తలాక్’ ముసుగులో ముస్లిం స్ర్తిలు ప్రజాస్వామ్య విలువలు కోల్పోతున్నారని, వారి జీవితాలు అగమ్యగోచరంగా తయారవుతోందని, వారి పిల్లలు విద్యావంతులు కాలేకపోతున్నారని, వీటన్నింటిని అరికట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తలాక్ వ్యతిరేక బిల్లును తెచ్చారు. ఈ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందినప్పటికీ రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీలన్నీ ఈ బిల్లు ఆమోదానికి అడ్డుపడుతున్నారు.
పిల్లల చదువుకు కావలసిన డబ్బులు ఇస్తున్నప్పుడు వాటితోపాటు ఒక బైబిలు ఇస్తే తీసుకోవడానికి తప్పేంటి? అంటూ టీవీ చర్చలలో బుద్ధిజీవి అయిన కంచె ఐలయ్య మాట్లాడడం, ఇటువంటి వారి అండదండలవల్లనే అమెరికాలోని మత స్వేచ్ఛ సంస్థ వార్షిక నివేదికలో భారతదేశంపై మత దాడులనే అపవాదు మోపారు. అందులో వాస్తవం లేదన్నది దేశ ప్రజలందరూ, ప్రపంచవ్యాప్త ప్రజలు కూడా అంగీకరించేది.
నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తరువాత అమెరికాతో ప్రగాఢమైన స్నేహసంబంధం ఏర్పడడం సెక్యులర్ ముసుగులోని కాంగ్రెస్ పార్టీకి, కమ్యూనిస్టులకు, క్రైస్తవ మతంలోనికి మారిన వారికి, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులకు కంటగింపుగా ఉన్నది. చిన్న చిన్న కారణాలతో ఒకరికొకరు ద్వేషించుకొని అమెరికా, భారత్‌లు శత్రుదేశాలుగా కావాలనేదే వీరి కోరిక. ఇలాంటి దేశద్రోహుల అండదండలతోనే అమెరికా దేశంలోని మత స్వేచ్ఛాసంస్థ భారత్‌లో మైనారిటీలపై ముఖ్యంగా ముస్లింలపై దాడులు చేస్తున్నారన్న విషయాన్ని దేశభక్తులైన వారందరూ మతాలకతీతంగా ఖండించాలి. అప్పుడే దేశ సమగ్రత పదిలంగా ఉంటుందనడంలో సందేహం లేదు.

-బలుసా జగతయ్య 90004 43379