సబ్ ఫీచర్

‘వామాంకస్థిత జానకి’ పక్కన శ్రీరామచంద్రుడే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీరాముడు లేని రామాయణాన్ని ఎలా వూహించలేమో అలాగే శ్రీరాముడు లేని భద్రాచలక్షేత్రాన్ని వూహించలేం. భద్రాచలంలో వున్నది ఏ దేవాలయం అని అడుగుతే, ఆసేతు హిమాచలం రామాలయం అనే జవాబిస్తారు. అక్కడ వున్నది రామనారాయణుడి గుడి అని ఒక్కడు కూడా చెప్పడు. అలాంటప్పుడు కుహనా పండితులకు ఆ మాత్రం అవగాహన, విజ్ఞానం లేకపోవడం విడ్డూరంగా ఉందనాలి. దేవాలయంలో వెలసిన రాముడు శంఖ-చక్రాలు, దనుర్భాణాలు, నాలుగు చేతులు ధరించి ఉన్నంత మాత్రాన, ఆయన సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరాముడు కాదని వాదిస్తూ, ఆ విగ్రహం రామనారాయణుడిదనే వింత వాదన లేవతీస్తున్నారు కొందరు. శ్రీరాముడు పుట్టక ముందు విష్ణువు. అవతారం అయిపోయాక తిరిగి శ్రీమహావిష్ణువవు అయ్యాడు. మధ్యలో సీతాలక్ష్మణసమేత శ్రీరామచం ద్రుడే! రామావతారం పూర్ణావతారమే.
దేవతల ప్రార్థన ప్రకారం దశరథ పుత్రుడై వున్నప్పుడు, దైవంలాగా వుండాల్నా, మనుష్యరూపంలో వుండాల్నా అన్న ప్రశ్నను దేవతలనే అడిగాడు నారాయణుడు. వారు చెప్పబోయేది తాను అప్పటికే నిశ్చయించుకున్నప్పటికీ, ఎదుటివారి గౌరవార్థం, వారి మనస్సును పరీక్షించేందుకు, ఆవిధంగా ప్రశ్నించడం రామావతారంలోని విశేష గుణం. అవతార పరిసమాప్తి వరకూ ఆయనది మనుష్యరూపమే. దేవతల క్షేమం కోరి శ్రీమహావిష్ణువు భూలోకంలో జన్మించేందుకు సంకల్పించాడు. శ్రీరాముడిగా, మానవుడిగా.. త్రేతాయుగాం తంలో శ్రీమహాలక్ష్మీదేవితోనూ, ఇతర భాగవతోత్తములతోనూ శ్రీమన్నారా యణుడు, వైకుంఠంలో శిష్ట రక్షణ-దుష్ట శిక్షణ చేసేదెలా అని చర్చించడానికి కారణం రావణాసురుడనే రాక్షసుడు. శ్రీమన్నారాయణుడు, పూర్వ జన్మలో తనను ఆరాధించి, తన దగ్గర నుండి వరం పొందిన దశరథుడి కోరిక తీర్చడానికి, ఆయన కుమారులుగా, శ్రీరామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నఅనే పేర్లతో అవతరించాడు. ఇది భగవత్ సంకల్పం. అలా పుట్టడంతోనే ఆయన నారాయణ అవతారం నుండి రామావతారానికి మారాడు. ఇక అప్పటినుండీ ఆయన శ్రీరాముడే. రామనారాయణుడు కాదు. వాస్తవానికి శ్రీరామావతారం అనుష్టానావతారం. భద్రాచలం దేవాలయంలో వున్నది శ్రీరాముడా లేక రామనారాయణుడా? అనే వివాదం ఎప్పటికప్పుడు తెరపైకి వస్తూనే వుంది. ఈ అంశంపై ఆ ప్రాంతంలో పలు విమర్శలు, ప్రతి విమర్శలు తీవ్రస్థాయిలో వున్నాయి. అక్కడ కొలువై ఉన్నది సాక్షాత్తు శ్రీరామచంద్రుడేనని రామ భక్తులు అంటుంటే, వెలసిన దేవుడు శంఖుచక్రాలు, ధనుర్బాణాలతో ఉన్న స్వామి కాబట్టి ఆయన ముమ్మాటికీ రామనారాయణుడేనని మరో భక్తివర్గం వారంటు న్నారు. స్వామివారికి నిర్వహించే నిత్య కల్యాణాల్లో ప్రవర చదివే సమయంలో ‘‘రామచంద్ర స్వామినే వరాయ’’ అని చెప్పాల్సి ఉండగా, ‘‘రామనారాయణ స్వామినే వరాయ’’ అని మార్చడం ద్వారా అర్చకులు అపచారం చేస్తున్నారనేది రామ భక్తుల విమర్శ. భద్రాద్రి దేవస్థానంవారు చెప్పడం మాత్రం, భద్రాదిల్రో వెలసిన శ్రీరామచంద్రుడిని కోదండరాముడుగా, భద్రాద్రి రాముడుగా, వైకుంఠ రాముడుగా, ఓంకారరాముడుగా, రామనారాయణుడుగా కొలవడం జరుగుతు న్నదని.. భద్రాచలంలో కొలువై ఉన్నది శ్రీరామచంద్రుడేనని, జరగాల్సింది సీతారాముల కల్యాణమేనని అందరూ దీనిని సమర్థించి, దైవాపచారాన్ని ఖండించాలని కోరుతూ భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి పేరుతో ప్రత్యేక బ్లాగ్ ఏర్పాటు చేసి, దాని ద్వారా ఓటింగ్ నిర్వహిస్తోంది ఒక వర్గం. భద్రాద్రిలో కొలువై ఉన్నది రాముడా? రామనారాయణుడా? అనే అంశంపై బహిరంగ చర్చను నిర్వహించనున్నట్లు కూడా సమితి తెలిపింది.
భద్రాచలక్షేత్రానికి పవిత్రమైన భక్తిగాథ ఆధారం. అలాగే రామాలయాల్లో భద్రాద్రి రామాలయానికి ప్రత్యేకస్థానం వుంది. చరిత్ర తెలిసిన ప్రతివారికీ ఈ దేవాలయంలో వున్నది శ్రీరామచంద్రుడే అన్న విషయం స్పష్టంగా అవగతవౌ తుంది. శ్రీరామచంద్రుడు వనవాసం చేసేటప్పుడు పర్వాతాకారంలో వున్న భద్రుడి శిలమీద కూర్చున్నాడు. ఆ సమయంలో మునివేషంలో వచ్చిన భద్రుడి కోరికమేరకు ఆయనకు శంఖ-చక్రాలు, ధనుర్భాణాలు, నాలుగు చేతులు ధరించి, సీతాలక్ష్మణసమేతుడై దర్శనం ఇచ్చాడని పురాణగాథ. ఆ తరువాత శ్రీరాముడు తన స్వస్వరూపంలో అక్కడే దేవతామూర్తిగా వుండి భక్తులకు దర్శనం ఇవ్వడానికి అంగీకరించాడు. వెంటనే రాముడు నిల్చిన శిల శ్రీ సీతారామలక్ష్మణమూర్తులుగా రూపొందింది. పావన గోదావరీ నదీతీరాన భద్రుడి కొండమీద స్వయంభుగా ఉద్భవించిన మూర్తులే భద్రాచల శ్రీ సీతారామచంద్ర మూర్తులు. సందేహం లేదు. ఆ విగ్రహాలను సీతారామలక్ష్మణ విగ్రహాలుగా భావించి, దర్శించి, పూజించినవారిలో జగద్గురువు శంకరాచార్య స్వాములవారు కూడా వున్నారు. సీతారామలక్ష్మణులను సేవించిన జగద్గురువు ‘‘వామాంకస్థిత జానకీ..’’ శ్లోకం రచించారని చాలామంది అంటారు. అలా ఆ మూర్తిత్రయాన్ని యథాతథంగా వర్ణిస్తూ ఆయన రచించిన ఆ శ్లోకం ఇప్పటికీ భద్రాచలంలో నిత్యానుసంధానంగా చదువుతున్నారు. రామదాసు రచించి, స్వయంగా పాడిన అనేక కీర్తనలో ‘‘దాశరథీ’’ అనో, లేక ‘‘కోదండరామా’’ అనో, శ్రీరాముడి గుణగణాలను ప్రశంసించాడు కానీ ‘రామనారాయణుడు’ అని ఎక్కడా ప్రస్తుతించలేదు. జైలులో వున్నప్పుడు పాడిన ప్రతి కీర్తనలోను ఆయన కీర్తనల నాయకుడు శ్రీరామచంద్రమూర్తే కానీ రామనారాయణుడు కానే కాదు. ‘‘రామ, ఇదేమిరా? కలికుతురాయి నీకు పొలుపుగ చేయిస్తి రామచంద్రా, నీవు కులుకుచు తిరిగెద వేవరబ్బ సొమ్మని రామచంద్రా..’’ వంటి కీర్తనలన్నిటిలోనూ రామదాసు వేడుకున్నది, ప్రార్థించినది శ్రీరాముడినేకానీ రామనారాయణుడుని కాదు. ఏకైక కుమారుడు గంజిలోపడి మరణించిన ప్పుడు భక్తరామదాసు వాడిని బతికించమని ప్రార్థించింది కూడా శ్రీరామచంద్రు డినే. అలా ఈనాటికీ రామదాసు భక్తిగీతాలు భద్రాద్రిలో ప్రతిధ్వనిస్తున్నాయి.
గుంటూరు వాస్తవయుడైన తూము లక్ష్మీనరసింహదాసు, మద్రాసు వాస్తవ్యు డైన వరదరామదాసు ఒకానొక సందర్భంలో భద్రాచల ఆలయ పునరుద్ధరణకు పూనుకున్నప్పుడు, అప్పటి నిజాం మంత్రి చందూలాల్ జారీ చేసిన ఫర్మానా లో ఆలయ ఆస్తి అంతా శ్రీరాముడి పేరున వుండే ఏర్పాటుచేశాడు. రామనారాయణుడి ప్రస్తావనే లేదు. ఆ తరువాత వరదరామదాసు, శ్రీరాముడి మొహరుతో పూర్వ పూజా విధానం అంతా పునరుద్ధరించాలని ఆదేశాలు ఇచ్చాడు. బహుశా ఆ ఆజ్ఞాపత్రం ఇప్పటికీ దేవాలయంలో వుండే వుంటుంది. వారి మరణానంతరం దేవాలయ వ్యయాన్ని భరించడానికి సంవత్సరానికి రూ. 18,500 మంజూరీ చేస్తూ, శ్రీరాముడి పేరుమీదే సనద్ ఇచ్చాడని చెప్పడానికి అనేక చారిత్రిక ఆధారాలున్నాయి. ఇదిలా వుండగా ఇటీవలి కాలంలో, భద్రాచలంలో జరుగుతున్న జగత్ప్రసిద్ధి గాంచిన సీతారామకళ్యాణోత్సవంలో అనూచానంగా చెప్పుకు వస్తున్న శ్రీరాముడి దశరథ ఆరంభ ప్రవరను, సీతాదేవి ప్రవరను మార్చివేయడం పలువురిని ఆశ్చర్యపరుస్తున్నది. అలాగే రామచంద్రమూర్తి పేరు మార్చి రామనారాయణ అని, ప్రవరను మార్చి సీతారాములను లక్ష్మీ నారాయణులుగా కల్యాణం జరిపించడం విడ్డూరంగా కనిపిస్తున్నది. నాలుగు చేతులున్నాయికదా అని ఆయన్ను రామనారాయణుడు అనడం అంతకంటే విడ్డూరం. యావత్ దేశంలోని అన్ని రామాలయాలలో శ్రీసీతారామకల్యాణంలో శ్రీరాముడి ప్రవర చదివేటప్పుడు వసిష్ట సగోత్రులైన అజ, రఘు, దశరథులను, సీతాదేవి ప్రవర చెప్పేటప్పుడు గౌతమ సగోత్రులైన నిమి, విదేహ, జనకరాజులను చెప్పి కన్యాదానం జరిపిస్తారు. అదేమి విడ్డూరమో కాని, భద్రాచలంలో మాత్రం (పూర్వంలా కాకుండా) ఇటీవలి కాలంలో రాముడిని రామనారాయణుడుగా సంభోదిస్తూ ఆయన గోత్రం అచ్యుత అని చెప్తున్నారు. అలాగే సీతాదేవికి బదులుగా సీతామహాలక్ష్మి అని చెప్పి సౌభాగ్య సగోత్రాన్ని ఆపాదిస్తున్నారు. ఒకవైపు సీతారాముల కల్యాణం అంటూనే, మరోవైపు ప్రవర చెప్పేటప్పుడు రామనారాయణ, సీతామహాలక్ష్మి అని చెప్పడం పరస్పర విరుద్ధం. దీని సారాంశం భద్రాద్రిలో ఇటీవలి కాలంలో శ్రీసీతారామకల్యాణం జరగడంలేదు. లక్ష్మీనారాయణ కల్యాణం జరుగుతోం ది. లోక విరుద్ధం. ఇది భక్తులను మోసంచేయడమే! గోత్ర ప్రవరాలే కల్యాణా నికి ప్రధానం. చైత్ర శుద్ధ నవమి నాడు దశరథుడుకి కొడుకు పుట్టాడు. ఆ రోజునే భద్రాచలంలో కల్యాణం జరుగుతున్నదని అంటే, ఆ జరిగేది శ్రీరాముడికే కదా! అంటే దశరథ సుతుడికే కదా? అలాంటప్పుడు దశరథుడుది జనకుడిది గోత్రాలు, ప్రవర చెప్పడం న్యాయం కదా? మార్చాల్సిన అవసరం ఏమిటి? శ్రీరాముడు సాక్షాత్తు నారాయణ స్వరూపుడే.. విష్ణు మూర్తి అవతారమే. కాదని ఎవరూ అనరు. కాకపొతే దశరథ పుత్రుడు ఎవరంటే, శ్రీరామచంద్రుడు అంటాం కాని, రామనారాయణుడు అనం కదా? సీతాదేవి భర్త ఎవరని అడిగితే ఆబాలగోపాలం ముక్తకంఠంతో శ్రీరాముడు అంటుంది కానీ రామనారాయణుడు అని ఎవరూ అనరు కదా? మరో అసంబద్ధం ఏమిటంటే.. క్షత్రియులైన సీతారాములను పూజారులు బ్రాహ్మణులుగా మార్చి వేశారు. రామనారాయణ పేరుతో అచ్యుత గోత్రం చదివి, పరబ్రహ్మ శర్మ, వ్యూహనారాయణ శర్మ, విభవవాసుదేవ శర్మ చెప్పుతున్నారు. సీతాదేవికి సౌభాగ్య గోత్రం చెప్పి, విశ్వంభర శర్మ, రత్నాకర శర్మ, క్షీరార్ణవ శర్మ అంటున్నారు. వీరి పూర్వీకులు శర్మలు అంటే వీరు బ్రాహ్మణులనే కదా? పెళ్లి బ్రాహ్మణులకు చేసి, పట్ట్భాషేకం మాత్రం ఆ తరువాత రాజుకు చేస్తారట! ఇదెక్కడి న్యాయం? నాలుగు చేతులతో దర్శనం ఇవ్వడం వల్ల రామనారాయణుడు అనే వాదన అసమంజసం. రాముడికి నాలుగు చేతులు వుండడాన్ని పాంచరాత్ర ఆగమమే చెప్పింది. దాని ప్రకారం నాలుగు చేతుల ధనుర్బాణాలు, శంఖ చక్రాలు కలిగింది శ్రీరామమూర్తే అని అర్థం. చతుర్భుజుడిగా కూడా రాముడు వుంటాడు. అంటే,‘వామాంకితస్థిత జానకి’ పక్కన వున్నది సాక్షాత్తు శ్రీరామచంద్రుడే. ఇకనైనా, భవిష్యత్‌లో భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణం, శ్రీరామ, సీతాదేవి అసలు ప్రవర, గోత్రాలతో చదవడం హర్షణీయం.

- వనం జ్వాలా నరసింహారావు, 80081 37012