ఆంధ్రప్రదేశ్
20న టిడిపిలో చేరనున్న బొబ్బిలి రాజులు?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 16 April 2016
విజయనగరం: బొబ్బిలి రాజవంశానికి చెందిన వైకాపా ఎమ్మెల్యే సుజయకృష్ణ, ఆయన సోదరుడు బేబీనాయన ఈనెల 20న తెలుగుదేశంలో పార్టీలో చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 20న సిఎం చంద్రబాబు జన్మదినం కావడంతో అదే రోజున బొబ్బిలి రాజులు టిడిపిలో చేరేందుకు ముహూర్తంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. కొద్దిరోజుల క్రితం బొబ్బిలి వచ్చిన వైకాపా నేతలు విజయసాయిరెడ్డి, కోలగట్ల వీరభద్రస్వామిలను కలిసేందుకు సుజయకృష్ణ విముఖత చూపిన సంగతి తెలిసిందే. సాలూరు, కురుపాం వైకాపా ఎమ్మెల్యేలు రాజన్నదొర, పుష్పవాణి కూడా త్వరలో టిడిపిలో చేరతారని, అయితే సుజయకృష్ణ మాత్రం ముందుగా చంద్రబాబు సమక్షంలో పార్టీ మారతారని తెలిసింది.